చైనా దేశంలోని వుహాన్ నగరంలో మొట్టమొదటిసారిగా విజృంభించిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 150 దేశాలను పట్టిపీడిస్తోంది. మొట్టమొదటిసారిగా వుహాన్ జంతువుల మార్కెట్ లో బయటపడ్డ వైరస్ రెండు నెలల్లోనే కొన్ని వేల ప్రాణాలను బలితీసుకుంది. లక్షల మంది దీని బారిన పడ్డారు. అయితే రెండు నెలలు తీవ్ర వేదన అనుభవించిన చైనా దేశం తర్వాత ఒక్కసారిగా కరోనా దెబ్బ నుండి బయటపడడం ప్రపంచ దేశాలన్నింనీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

 

విషయం ఏంటంటే సెంట్రల్ చైనా లోని అతి ప్రధానమైన నగరంలోని లో వైరస్ మొట్టమొదటిసారి వ్యాపించడంతో చైనాలో చాలా ప్రాణ నష్టం జరిగింది. ఇక ఇటలీ, అమెరి, ఇరాన్ సంగతి అయితే వర్ణనాతీతం. గత మూడు రోజుల్లో చైనాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ప్రభుత్వం ప్రకటించగా ఇప్పటివరకు వారి దేశంలో మరణాల సంఖ్య ను వెల్లడించిన చైనా ను చూసి పరిశోధకులు మరియు విశ్లేషకులు అంతా ముక్కున వేలేసుకున్నారు.

 

ఎక్కడో ఉన్న ఇటలీలోని రోజుకి దాదాపు వెయ్యి ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే రెండు నెలలుగా చైనా వారు కేవలం 3300 మందే వారి దేశంలో చనిపోయారు అని చెప్పడం నమ్మశక్యంగా లేదనే చెప్పాలి. అయితే భారత్ లోని చెన్నై కు చెందిన ఒక కంపెనీ…. హై టెక్నాలజీ కార్లలోని సెక్యూరిటీ సిస్టం డిజైన్ చేస్తుంది.వుహాన్ సిటీలో కూడా వీరికి లక్షలాది మంది కస్టమర్లు ఉండగాకరోనా తాకిడి తగ్గిన తర్వాత దాదాపు కొన్ని లక్షలమంది వారి కాళ్లకు ఉండే సెక్యూరిటీ సిస్టమ్ ను రీఛార్జ్ చేసుకోలేదట.

 

పరిస్థితి మెరుగుపడిన తర్వాత కూడా ఎందుకు రీచార్జి చేసుకోలేదని వారికి చెన్నై నుండి కంపెనీకి చెందిన సిబ్బంది ఫోన్లు చేయగా కొన్ని లక్షల మంది కస్టమర్ల ఫోన్ కు అందుబాటులో లేవని వస్తోంది. ఎన్ని రోజులు ప్రయత్నించినా ఫోన్ లు అన్నీ అందుబాటులో లేవు…. నెంబర్లు పనిచేయట్లేదు అన్ని వస్తున్నాయి కానీ వారంతా ఫోన్ ఎత్తట్లేదు. దీంతో వారంతా ఏమయ్యారు...? అసలు చైనా మరణాల సంఖ్య కరెక్ట్ గానే చెప్పింది అని కొత్త అనుమానాలు మొదలయ్యాయి. లేదా తక్కువ మరణాల సంఖ్య చెప్పి కుట్రపూరితంగా కావాలనే ఇతర దేశాలను తప్పు దారి పట్టిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: