ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా విజృంభిస్తోంది. క‌రోనా జోరు ఊహ‌కేక అంద‌డం లేదు. ఇట‌లీలో శ‌నివారం ఒక్క రోజే ఏకంగా 889 మంది చ‌నిపోయారు. దీంతో అక్క‌డ మృతుల సంఖ్య 10 వేల‌కు చేరుకుంది. ఆదివారం ఉద‌యం 6 గంట‌ల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే 6, 62, 852 కేసులు న‌మోదు అయ్యాయి. నిన్న‌టితో పోలిస్తే ఇది 62 వేలు ఎక్కువ‌. ఇక మ‌ర‌ణాల సంఖ్య 30, 847 కు చేరుకుంది. ఇక రిక‌వ‌రీ కేసులు 1, 72, 798 ఉన్నాయి. ఇక దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 179 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. కేసుల న‌మోదులో కేర‌ళ‌, మ‌హారాష్ట్ర టాప్ స్థాయిలో ఉన్నాయి.

 

ఇక మర‌ణాల సంఖ్య 20కు చేరుకున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే ఇక ఏపీలో క‌రోనా కూడా విజృంభిస్తోంది. 19 మంది పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. శ‌నివారం ఒక్క రోజే ఆరు కేసులు న‌మోదు అయ్యాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెండేసి కేసుల‌తో పాటు క‌ర్నూలు, ప్ర‌కాశం జిల్లాల్లో ఒక్కో కేసు న‌మోదు అయ్యాయి. ప్ర‌కాశం జిల్లా చీరాల మండ‌లం న‌వాబ్‌పేట గ్రామంలో ఓ వ్య‌క్తికి పాజిటివ్ వ‌చ్చింది. ఇక తెలంగాణ‌లో పాజిటివ్ కేసులు 67కు చేరుకున్నాయి. శ‌నివారం ఒక్క రోజే తెలంగాణలో 6 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: