కరోనా రక్కసి ప్రపంచాన్ని కాటేస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచం అంతా లాక్ డౌన్ ప్రకటిస్తున్నా కూడా కరోనా దూకుడుకు మాత్రం బ్రేకులు వేయడం లేదు. ఇక ఈ వైరస్ దెబ్బతో ప్రధానంగా ఇటలీ, అమెరికా, స్పెయిన్ దేశాలు అతలా కుతలం అవుతున్నాయి. ఆదివారం ఉదయం 7 గంటల వరకు వరల్డ్ వైడ్ కరోనా కేసుల అప్డేట్స్ తీసుకుంటే 6,63, 168 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక 30, 855 మరణాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 30 వేల మంది చనిపోతే 10 వేల మంది ఇటలీలో మాత్రమే చనిపోయారు.
ఇక మనదేశం విషయానికి వస్తే ఇప్పటి వరకు కరోనా కేసులు 918 నమోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే ఏకంగా 179 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇందులో మహారాష్ట్ర, కేరళ నుంచే అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక మన దేశంలో కరోనా సోకి ఇప్పటి వరకు 20 మంది చనిపోయారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో శనివారం ఒక్క రోజే ఏకంగా 8 కేసులు నమోదు అవ్వగా ఇప్పటి వరకు అక్కడ పాజిటివ్ కేసులు 67 నమోదు అయ్యాయి.
తెలంగాణలో పాతబస్తీలో ఒకే కుటుంబంలో 6, కుత్బుల్లాపూర్లో ఒకే కుటుంబంలో 4 గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక ఏపీలో శనివారం 6 కేసులు నమోదు అవ్వగా.. ఇందులో గుంటూరు, ప్రకాశం, కర్నూలు, వైజాగ్ జిల్లాల నుంచి కొత్త కేసులు వచ్చాయి. ఈ 6 కొత్త కేసులను కూడా కలుపుకుంటే ఇప్పటి వరకు ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కు చేరుకుంది.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple