మందుబాబులకు మాంచి కిక్కిచ్చే వార్త. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది. దేశంలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. 21 రోజులపాటు ఈ లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో అస్త్యవసర సేవలు మినహా ఏమి పనిచేయవు. అంటే అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. ఈ క్రమంలోనే బార్లు, వైన్స్లు సైతం బంద్ కావడంతో మందుబాబులు విలవిలలాడిపోతున్నారు.
చుక్క పడనిదే దేహం కదలని పరిస్థితుల్లో మందుబాబులు వణికిపోతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడుతున్న వారూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని, రోజుకు కనీసం ఒక గంటైనా వైన్స్ షాపులు తెరవాలని విజ్ఞన్తి చేశారు మద్యం ప్రియులు. ఇదిలా ఉంటే.. ఓ కంపెనీ తాగినన్ని బీర్లు.. అది కూడా మూడు నెలలు పాటు ఫ్రీగా ఇస్తానంటోంది. కాని, దీనికి ఒక కండీషన్ ఉంది. కుక్కను దత్తత తీసుకోవాలి.
అమెరికాలోని మిన్నెసోటాలో ఉన్న మిడ్ వెస్ట్ యానిమల్ రెస్క్యూ సంస్థ ఈ అదిరిపోయే ఆఫర్ను ప్రకటించింది. కరోనా మహమ్మారి వల్ల ఆమెరికాలో చాలా మంది జంతువులకు సంబంధించిన సంస్థలు మనుషులను దగ్గరకు రానివ్వడం లేదు. ఎందుకంటే మనుషులతో వాటికి కరోనా సోకుతుందన్న భయం. అయితే మిడ్ వెస్ట్ సంస్థ దాదాపు 500 కుక్కలను దత్తత ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే బుష్ బీర్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకొని ముందడుగు వేసింది.
ఎవరైతే కుక్కలను దత్త తీసుకుంటారో.. వాళ్లకు మూడు నెలల పాటు ఎంత తాగితే అంత బీర్లు ఫ్రీగా అందిస్తామన్నారు. అలాగే కుక్కను దత్తత తీసుకున్న వారు.. ప్రూఫ్ కింద కుక్కతో ఫొటో దిగి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలి. ఇలా ముందుగా పంపిన వారికి రూ.7500 రివార్డ్ కూడా ఇవ్వనుంది. ఈ ఆఫర్ మార్చి 25 నుంచి ఏప్రిల్ 25 వరకు మాత్రమే.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle