దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రధాని మోడీ 21రోజులు లాక్ డౌన్ విధించారు. దింతో దేశంలో పాఠశాలలు, సినిమా థియేటర్లు, రవాణా సౌకర్యాలు అన్ని స్తంభించిపోయాయి. కరోనా వైరస్ పొట్టకూటి కోసం వచ్చిన వారిని పస్తులు ఉంచుతుంది. సొంత ఊర్లోకి వెళ్దాం అనుకునే వారికీ కాలి నడకే గతైయ్యింది. ఇక పేదవారి కష్టాలు అయితే వర్ణ రహితం. మనిషి ఆరోగ్యాంగా ఉన్నపుడే ఎక్కువ దూరం నడవటం కష్టం. అలాంటిది ఒక్క జంట అందులో ఆమె గర్భిణీ 100కిలో మీటర్లు తినడానికి తిండి లేక రోడ్డుపై వెళ్తున్న బాధాకరమైన విషయం ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని బులంద్ సహర్ అమర్ ఘడ్కి చెందిన దంపతులు. భార్యాభర్తలు జీవనోపాధి కోసం దేశ రాజధాని అయినా ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఒక్క కంపెనీలో ఆమె భర్త, చిన్న చిన్న పనులు భార్య చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇదే తరుణంలో కరోనా వారి జీవితాలను తారుమారు చేసింది. కరోనా ప్రబావాలనికి వారి పని పోయింది. ఇంటి యజమాని రూమ్ ను ఖాళీ చేయమన్నాడు. యజమానికి జవాబు ఇవ్వలేని పరిస్థితి కావడంతో రూమ్ ఖాళీ చేశారు.
వారి దగ్గర ఉన్న కాస్త డబ్బుతో సొంత ఊరికి వెళ్లాలనుకున్నారు. కానీ రవాణా సౌకర్యం లేకపోవడంతో.. వారు గుండె నిబ్బరం చేసుకొని సొంతూరికి కాలినడకన బయల్దేరారు. అయితే వివాహిత 8 నెలల గర్భవతి కావడం ప్రతీ ఒక్కరిని కదిలించింది. వారి గమ్య స్థానం కోసం భార్యభర్తలు ఇద్దరూ నడుచుకుంటూ ముందుకు వెళుతున్నారు.
అయితే వారిని ఏ దేవుడు కరుణించాడో కానీ షహరన్ పూర్ బస్టాండ్ వద్ద స్థానికులు వారిని చూశారు. అక్కడ నవీన్ కుమార్, రవీంద్ర అనే యువకులు వారిని ఆపి సమస్య అడిగి తెలుసుకున్నారు. యువకులు ఆ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు. వారు స్థానికుల సహాకారంతో పోలీసులు నగదు జమ చేసి వారికీ అందజేశారు. దంపతులు రెండురోజుల నుంచి ఏమి తినకపోవడంతో వారికీ అన్నం పెట్టించారు. అనంతరం స్థానికులు అంబులెన్స్ పిలిపించి వారి స్వస్థలానికి పంపించారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.