టాలీవుడ్ లో ఇప్పుడు ప్రభాస్ హవా నడుస్తుంది. అతను సినిమాలు చేసినా చేయకపోయినా సరే అతనికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో ఏ హీరో సినిమా వచ్చినా సరే ప్రభాస్ సినిమా కోసం కచ్చితంగా ఫాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే దర్శక నిర్మాతలు ఎక్కువగా అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రభాస్ ఇప్పుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. టాలీవుడ్ లో ప్రభాస్ కోసం నిర్మాతలు కూడా పోటీ పడుతున్నారు, 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ప్రభాస్ కరోనా వైరస్ బాధితుల కోసం ముందుకి రావాలని భావిస్తున్నాడు. అతనికి రాజమండ్రి లో ఇల్లు ఉంది. ఆ ఇల్లుని... ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఇవ్వాలని ప్రభాస్ భావిస్తున్నాడు. ప్రభాస్ తన ఇంటిని ఇవ్వాలని ఇప్పుడు అధికారులను ఒక మంత్రిని కూడా సంప్రదించినట్టు సమాచారం. అలాగే హైదరాబాద్ లో ఉన్న తన ఇంటిని కూడా ఇవ్వడానికి గాను ప్రభాస్ ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపాడు అని అంటున్నారు. తెలంగాణా ప్రభుత్వం కూడా అందుకు ఓకే చెప్పింది అంటున్నారు. 

 

ప్రభాస్ తీసుకున్న నిర్ణయం చూసి టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ షాక్ అయ్యారట. తన ఇంటిని ఆస్పత్రిగా మార్చేందుకు ప్రభాస్ ఇవ్వాలని భావించడం నిజంగా మంచి పని అంటున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ కరోనా వైరస్ బాధితుల కోసం 5 కొట్ల వరకు సహాయం చేసాడు. ప్రధాని సహాయ నిధికి దాదాపు 4 కోట్ల వరకు సహాయం చేసాడు. ఇప్పుడు ప్రభాస్ ఇంటిని ఆస్పత్రిగా మార్చాలని అవసరం అయితే వాడుకోవాలని చెప్పడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. దీనిపై తెలంగాణా ప్రభుత్వం అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశాలు ఉన్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: