కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గాను టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తున్నారు. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి సాయం ప్రకటిస్తున్నారు. ఒక్కో హీరో కోట్ల రూపాయల సాయం చేయడం చూసి బాలీవుడ్ కూడా ఫిదా అయిపోయింది. కష్టాల్లో ఉన్న తమ అభిమానుల కోసం ఈ సాయం చెయ్యడానికి ముందుకు రావడం అనేది నిజంగా అభినందించే విషయం. కరోనా వైరస్ కోసం ఇప్పుడు ప్రభాస్, ఎన్టీఆర్ , మహేష్ బాబు, చిరంజీవి, రామ్ చరణ్ ఇలా అందరూ కూడా సాయం ప్రకటిస్తున్నారు. 

 

ఈ నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మెగా హీరోలు అందరితో కలిసి ఆయన ఒకటి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తిండి కి లేక ఎక్కువగా పేదలు అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు పేదలు రోడ్ల మీద పడుకునే అవకాశాలు ఉన్నాయి. తిండి లేని పరిస్థితుల్లో కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకునే విధంగా ఉన్నారు. ఈ నేపధ్య౦ లో చిరంజీవి వారి కోసం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఇంటిలోనే వంట వండించి... 

 

వారు అందరికి కూడా హైదరాబాద్ లో స్విగ్గి ద్వారా సరఫరా చెయ్యాలని భావిస్తున్నారు. హైదరాబాద్ మురికి వాడల్లో కొంత మంది ఇప్పుడు తిండికి లేక ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వారు అందరికి కూడా ఇప్పుడు ఈ సహాయం చేయడానికి చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చెయ్యాలని ఆయన భావిస్తున్నారు. ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి కూడా ఈ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. త్వరలోనే దీన్ని కార్య రూపంలో తీసుకురానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: