ఒక్క కార్యక్రమం.. ఒకే ఒక్క కార్యక్రమం.. దేశంలో వందల కొద్దీ కరోనా కేసులకు కారణమైంది. దేశంలో కరోనా సునామీ సృష్టిస్తోంది. వారి నుంచి ఇప్పటివరకూ ఎంత మందికి సోకిందో అర్థం కాని పరిస్థితి.. అసలు ఇంతకూ ఏం జరిగింది..అసలు ఢిల్లీలో ఏం జరిగింది..? ఓసారి చూద్దాం..
మార్చి 1 నుంచి 15 వరకు దిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని తబ్లిగ్-ఏ-జమాత్ అనే సంస్థ ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దేశంలోని పలు రాష్ట్రాల వారు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని అనేక జిల్లాల నుంచి కూడా పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నిజాముద్దీన్ సమావేశానికి దేశం నుంచే కాకుండా ఇండోనేసియా, మలేసియా, సౌదీ అరేబియా, కజకిస్థాన్ల నుంచి కూడా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
దేశం నుంచి వచ్చిన వారు విదేశీయులు మొత్తం మీద 2000 మంది వరకు దీనికి హాజరయ్యారు. అంతే కాదు.. ఈ కార్యక్రమానికి వచ్చినవారు ఆరు అంతస్తుల డార్మిటరీల్లో 280 మంది విదేశీయులూ ఉన్నారట. అక్కడకు వచ్చిన వారిలో ఇప్పటి వరకూ 300 మందికి కరోనా లక్షణాలు కనిపించాయి. వారిని ఆసుపత్రులకు తరలించారు.
తాజాగా తెలంగాణలో మరణించిన ఆరుగురు కూడా అదే కార్యక్రమానికి వెళ్లి వచ్చిన వారే. అటు ఆంధ్రాలోనూ తూర్పుగోదావరి జిల్లాలో, విజయవాడలో వెలుగుచూసిన కరోనా కేసులకూ మూలాలు ఈ కార్యక్రమంలోనే ఉన్నాయని తేలింది. ఇప్పుడు ఈ కార్యక్రమం దేశంలోనే కలకలం సృష్టిస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరి వివరాలనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేకరిస్తున్నాయి. మరి ఈ కార్యక్రమానికి హాజరైన వేల మంది దేశంలో ఎన్ని వేల మందికి కరోనా అంటించి ఉంటారన్న ఊహే భయంగొలుపుతోంది. పూర్తి వివరాలు తెలిస్తే కానీ.. ఈ కార్యక్రమం ప్రభావం దేశంపై ఎంత ఉంటుందన్నది ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple : https://tinyurl.com/NIHWNapple