కరోనా వైరస్ తో ప్రపంచం అల్లకల్లోలం అయిపోతోంది. ఎంతో మంది జనం ఆసుపత్రి పాలయ్యారు. ఇప్పటికే ఈ కరోనా మృతుల సంఖ్య  కూడా పెరిగింది. అలానే ఆసుపత్రిలో ఉన్న వారికి కూడా వైద్యం అందిస్తున్నారు. మొత్తం దేశం అంత కూడా లాక్ డౌన్ లో ఉన్న దుస్థితి.

 

 

కరోనాని  కట్టడి చెయ్యాలని కూడా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అయితే ఇప్పుడు మన దేశంలో డాక్టర్లు, నర్సులు ప్రజలకి వైద్యం అందిస్తున్నారు. తాజాగా ఒక నటి ముంబాయి ఆసుపత్రిలో నర్సుగా చేరింది. ఆమె కరోనా పాజిటివ్ ఉన్న బాధితులకి సేవ చేస్తోంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమా ఫ్యాన్ లో కనిపించింది ఈ నటి షికా మల్హోత్రా.

 

 

ఆమె తన సొంత ఆసక్తితో ముంబయి ఆసుపత్రిలో నర్సుగా చేరింది. మన దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయిన  రాష్టం మహారాష్ట్ర. ఆమె అక్కడికే వెళ్లాలని నిర్ణయించుకుని నర్సుగా అక్కడ సేవ చేస్తోంది. ఈ నటి ఢిల్లీ లోని వర్ధమాన్ మహావీర్ మెడికల్ కళాశాలలో , సఫ్దర్ గంజ్  ఆసుపత్రి లో ఆమె నర్సింగ్ డిగ్రీ చేసింది .

 

 

ఆలా  ఆమె చదవడం వల్ల ఈ అవకాశం వచ్చింది . ప్రస్తుతం కరోనా పాజిటివ్ ఉన్న వాళ్లకి వైద్యం చేస్తూ ఆమె సేవని అందిస్తోంది. ప్రభుత్వానికి ప్రతీ ఒక్కరు సపోర్ట్ చెయ్యాలని ఆమె చెప్పింది. అంతే కాకుండా ప్రజలని ఇళ్ల నుండి బయటకి రావద్దు అని కూడా ఆమె చెప్పింది. ఆమె ఒక నటిగా , నర్సుగా ఎంటర్టైన్ చేస్తూ ప్రజలకి సేవ చేస్తోంది . ఇలా ఈ నటి ప్రజలకి తన వంతు సేవల్ని చేస్తూ సహాయం అందిస్తోంది . 

 

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
 
Google: https://tinyurl.com/NIHWNgoogle
 
 
 
 


 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: