ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలు ఎక్కువగా అయ్యాయి. అక్రమ సంబంధ పెట్టుకొని వారి వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటున్నారు. కొందరు వారి సంబంధాన్ని కొనసాగించడానికి తమ భర్త, భార్యలు అడ్డుగా ఉన్నారని ఎంతటి అఘాత్యానికైన పాల్పడానికి వెనకాడడం లేదు. అటు పిల్లలను, వారి భవిష్యత్తును కూడా ఆలోచించ కూడా వారి సంతోషల కోసం ఇంటి నుండి దూరంగా వెళ్లిపోతున్నారు. మరలా తిరిగి వచ్చిన వారిని చూసి కుటుంబ సభ్యులు వారిని కొట్టారు అందులో వివాహిత మరణించింది ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

 


 
వివరాల్లోకి వెళ్తే... మదురై జిల్లా ఉసిలంపట్టి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన మహిళతో 15ఏళ్ల క్రితం వివాహమైంది. మంచి భర్త చక్కగా ఇద్దరు పిల్లలు అందరు మెచ్చిన మంచి కుటుంబం వారిది. చాలా సంతషంగా సాగుతున్న వారి జీవితంలోకి ఒక్క పెను తుఫాన్ వచ్చింది. ఆమె తన చక్కటి సంసారం వదిలి ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలియకుండా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ వస్తుంది. ఎంత రహస్యంగా ఉంచిన ఎదో ఒక్కరోజు బయటపడాల్సిందేగా ఎలాగో ఆమె అక్రమ సంబంధం గురించి వారి కుటుంబ సభ్యులకు తెలిసింది.

 

 

అయితే ఆమె తన భర్తను కాదనుకొని యువకుడితో కలిసి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. గత పదేళ్లుగా వారు ఎవరికి కనిపించకుండా సహజీవనం కొనసాగిస్తారు. తాజాగా కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. లాక్ డౌన్ విధించడంతో ఆమె తన సొంతూరికి వచ్చింది. వారి పరువును తీసి వెళ్ళిపోయి తిరిగి వచ్చిన ఆమె చుసిన కుటుంబ సభ్యులకు పట్టలేనంత కోపం వచ్చింది. ఆ కోపంతో కుటుంబ సభ్యులు వారిద్దరి పై దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తన ప్రాణాలను కోల్పోయింది. ఆమె ప్రియుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: