ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క వైరస్ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. చైనాలోని పుహాన్ పట్టణం లో పుట్టుకొచ్చిన ఈ మాయదారి కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తం విస్తరించింది. వేల మరణాలు, లక్షల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. ఈ కరోనా వల్ల ఏ ఇంట శుభకార్యాలు లేకుండా పోయాయి. సినీ పరిశ్రమ మొత్తం షెట్ డౌన్ చేశారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేయడంతో మనుషులు బయట తిరిగే పరిస్థితి లేదు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించడంతో ముందస్తుగా ఏర్పాటు చేసుకున్న వివాహాలు, ఇతర కార్యక్రమాలను ప్రజలు వాయిదా వేసుకుంటున్నారు. ఒకవేళ లాక్ డౌన్ ఉల్లంఘించి పెళ్లి ఇతర కార్యక్రమాలు జరుపుకుంటే నిర్ధాక్షిణ్యంగా కేసులు నమోదు చేసి జైల్లో పెట్టేస్తున్నారు. దాంతో ఇకవేళ పెళ్లి కార్యక్రమాలు జరుపుకోవాలంటే వారి కుటుంబ సభ్యుల మద్య జరిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొందరు తమ వివాహాలను దేవుడి సన్నిధిలో జరుపుకోవాలనే ఉద్దేశంతో గుడి ముందు బంధువుల సమక్షంలో ఒక్కటవుతున్నారు. తాజాగా మదురైకి చెందిన వధూవరులు తమ వివాహాన్ని తిరుపురుకుండ్రంలోని మురుగన్ గుళ్లో జరిపించుకోవాలనుకున్నారు. దేశవ్యాప్తంగా 1071 కరోనా బారిన పడ్డారు. వీరిలో 99 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ కరోనా 21 వరకు కొనసాగుతుందన్న విషయం తెలిసిందే.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple