మన దేశం అభివృద్ధి పరంగా ముందుకు దూసుకునిపోతుంది. కానీ ఎక్కడో ఒకచోట, ఎదో ఒక రూపంలో  పరువు, ప్రతిష్ట అంటూ ప్రాణాలు తీసేవాళ్లు కూడా ఉన్నారు. ఎంత అభివృద్ధి చెందుతున్న కానీ కొంతమంది మనుషుల్లో ఇంకా మార్పు అనేది రావడం లేదు. కూతురు... తండ్రి మాట కాదని వేరే అతన్ని పెళ్లి చేసుకుందని తండ్రి కక్ష కట్టాడు! ప్రేమించిన అమ్మాయిని సరిగా చూసుకోలేక పోతున్నా అని ప్రేమికుడు ఆవేదన ...! బతకడానికి వలస వెళితే కరోనా ఎఫెక్ట్... ! చివరికి సొంత గ్రామానికి వచ్చి మామ చేతిలో గోరాతి గోరంగా చనిపోయిన ఒక అభాగ్యుడు జీవిత గాధ  ఇది. ఎవరు ఆ యువకుడు?  అసలు ఏంటి ఇతని కధ అనేది చూద్దాం...! ఈ దారుణమైన సంఘటన  తమిళనాడులోని ఒందికుడిసై  గ్రామంలో జరిగింది.  

 

 

ఒక 19 ఏళ్ళ అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాడు సుధాకర్. తను చేసే పని పక్కన పెట్టి ప్రేమించే పని మొదలుపెట్టాడు.కొన్ని రోజులకి ఆమె కూడా ప్రేమించింది. ఆరు నెలలు గడిచింది.తర్వాత ఎవరికీ చెప్పకుండా లేచిపోయి వలజపేటలోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అమ్మాయి ధనవంతుల కుటుంబం నుంచి వచ్చింది. సుధాకర్  పని చేస్తే తప్ప రోజు గడవదు. సుధాకర్ తో సర్దుకు పోలేకపోయింది. సుధాకర్ మీద కొంచెం అసహనం వ్యక్తం చేస్తూ వచ్చింది. కొన్నాళ్ళకి  అమ్మాయి తండ్రికి వీళ్ళ గూర్చి తెలిసి ఊరికి తీసుకుని వచ్చి ముందు పంచాయతీ పెట్టి, ఇద్దర్నీ విడగొట్టారు. అయితే సుధాకర్‌కి డౌట్ వచ్చింది తనను చంపేస్తారని భయపడి  ఊరి నుంచీ పారిపోయి, చెన్నై వెళ్లిపోయాడు. అక్కడే ఏదో పని చేసుకుంటున్నాడు.

 

 

 పాపం ఇంతలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  కరోనా వైరస్‌ని తరిమికొట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు.చెన్నైలో పనులు లేకపోయేసరికి  సుధాకర్ సొంతూరు వచ్చాడు. తన తల్లిదండ్రులతో ఉండసాగాడు. ఈ విషయం అమ్మాయి తండ్రికి తెలిసి కత్తులకి  పదునుపెట్టారు. నాలుగు రోజుల తర్వాత రోజంతా ఇంట్లోనే ఉండటం బోర్ అనుకున్న సుధాకర్  అలా బయటకు వచ్చాడు. ఈ విషయం అమ్మాయి తండ్రికి తెలిసింది. 

 

 

లాక్ డౌన్ సమయంలో పోలీసులకు కనిపిస్తే ఊరుకోరని ఊరి చివరకు వెళ్లాడు సుధాకర్. అక్కడకు ఓ కారు వచ్చి ఆగింది. కారులోంచి సుధాకర్, వాళ్ళ తమ్ముడు కొడుకు కత్తులతో దిగారు. వాళ్ళని చూడగానే కంగారు పడి పరిగెత్తాడు సుధాకర్. అసలే కసి, కక్షతో ఉన్న వాళ్ళు సుధాకర్‌ ని ఎక్కువ సేపు పరిగెత్తనివ్వలేదు. పట్టుకొని కత్తులతో పొడిచి చంపేశారు. పచ్చని పొలాలు రక్తంతో తడిచిపోయాయి. అత్యంత దారుణ పరిస్థితుల్లో సుధాకర్ ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఇద్దర్నీ అరెస్టు చేసారు. ప్రేమించిన అమ్మాయే అతన్ని పట్టించిందనీ ఊరంతా ఆ కుటుంబాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. లాక్‌ డౌన్ సమయంలోనూ, పరువు  హత్యలు ఆగడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: