ఇఫ్పుడు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది.  ఎక్కడిక్కడ అన్నీ మూసివేశారు.. ఈ సమయంలో పేద ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది.  కొన్ని చోట్ల ఒక్క పూట తిండి కోసం నానా తిప్పలు పడుతున్నారు.  ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలు తీసుకు వచ్చి వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది.  ఈ సమయంలో ఉన్నవారు లేని వారి గురించి ఆలోచించాలని.. పేద ప్రజలకు సహాయార్థం తమ వందు విరాళాలు ఇవ్వాాలని రాజకీయ, సినీ, క్రీడా ఇతర రంగాలకు చెందిన వారు ముందుకు వస్తున్నారు. 

 

అయితే కొంత మంది మాత్రం కరోనా గురించి తెగ లెక్చర్స్ ఇస్తూ పోస్టులకు పరిమితం అవుతున్నారు.  కానీ ఒక్క పైసా జారడం లేదు. తాజాగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలు, సామాన్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే సినీనటులు మాత్రం ఇంట్లో ఎంజాయ్‌ చేస్తూ ఇందుకు సంబంధించిన వీడియోలను పోస్టులు చేస్తుండడంపై బాలీవుడ్ దర్శకురాలు ఫ‌రా ఖాన్   మండిపడ్డారు. విశాల ప్రదేశాల్లో వ్యాయామాలు చేస్తూ హీరోయిన్‌లు చేస్తోన్న పోస్టులపై ఆమె స్పందించింది. 

 

లాక్ డౌన్ తో సామాన్య ప్రజలకు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఆ దేవుడికే తెలుసు.. మీకంటే విశాలమైన జిమ్ములు ఉన్నాయి.. ఎంజాయ్ చేస్తున్నారు.. ఇది అందరికీ తెలిసేట్టు చేసి గొప్పతనం చాటుకుంటున్నారా అంటూ ప్రశ్నించింది. లాక్‌డౌన్‌ విధించిన సమయంలో కూడా సెలబ్రిటీలు అందం గురించి ప్ర‌త్యేక‌ శ్ర‌ద్ధ తీసుకుంటున్నారని చెప్పింది. చేత‌నైతే పేద‌వారిని ఆదుకోవాలని, అంతేకాని అవ‌స‌రం లేని పోస్టులు చేయొద్దని ఆమె ముక్కు సూటిగా మాట్లాడుతూ ఓ వీడియో పోస్టు చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

BAS KARO yeh workout videos !! 😝 video shot by :- #diva

A post shared by farah khan Kunder (@farahkhankunder) on

మరింత సమాచారం తెలుసుకోండి: