కరోనా వైరస్ ని కట్టడి చేసే విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఎం చెయ్యాలో అర్ధం కాని స్థితిలో ఇప్పుడు జగన్ సర్కార్ ఉందని అంటున్నారు. ఆర్ధికంగా కూడా ఆ దేశం ఇప్పుడు కరోనా వైరస్ విషయంలో ఇబ్బంది పడుతుంది. కనీసం ఆ రాష్ట్రానికి రెండుకోట్ల రూపాయలు కూడా ఆదాయం వచ్చే పరిస్థితి కనపడట౦ లేదు. ఆ రాష్ట్రానికి అసలే ఆర్ధిక వనరులు తక్కువ. దీనితో జగన్ సర్కార్ నానా అవస్థలు పడుతుంది ఇది పక్కన పెడితే ఇప్పుడు విదేశాల నుంచి వచ్చిన వారు బయటకు రావడం లేదు అక్కడ.
వారికీ బొట్టు పెట్టి పిలిచినా సరే వచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఇక ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి పెద్ద తల నొప్పిగా మారింది. ఏపీ సర్కార్ కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే కొందరు దరిద్రులు కావాలని చేసే పనులకు ఇప్పుడు రాష్ట్రం బలిపోతుంది. రాష్ట్రం పక్కన పెడితే వారి కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కరోనా వైరస్ ఇప్పట్లో వదిలే విధంగా కనపడటం లేదు. ఇది గనుక రాష్ట్రంలో మూడో దశకు చేరితే మాత్రం పరిస్థితులు మరింత విషమం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
దీనితో ప్రభుత్వం తీసుకునే చర్యల విషయంలో జగన్ మరింత కఠినం గా వ్యవహరించాలని భావిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు గనుక బయటకు రాకపోయినా సరే ఏ మాత్రం విచారణ లేకుండా కేసు నమోదు చేసి జైల్లో పెట్టాలని ఇందుకు కేంద్ర సహాయం కూడా తీసుకోవాలని జగన్ సర్కార్ భావిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 40 నమోదు అయ్యాయి. ఇవి మరింతగా పెరిగితే మాత్రం ఇబ్బంది పడటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple