మనదేశంలో కరోనా నిమిషం నిమిషానికి ప్రళయ తాండవం చేస్తోంది. ఇక మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు చూస్తే 8.02 లక్షల పాజిటివ్ కేసులతో కరోనా విజృంభిస్తోంది. ఇక మరణాలు కూడా ఇప్పటికే 39 వేలు దాటేసి 40 వేలకు చేరువ అవుతున్నాయి. ఇక ఇప్పటి వరకు 1.72 లక్షల మంది రికవరీ అయ్యారు. ఇక ప్రత్యేక శిబిరాల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 6 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు వీరంతా విలవిల్లాడుతున్నారు. ఇక ఢిల్లీలోని నిజాముద్దీన్లో జరిగిన మత సభలకు కేవలం తెలంగాణ నుంచే ఏకంగా వెయ్యి మంది వెళ్లినట్టు చెపుతున్నారు.
ఇక మనదేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటికే 1500కు చేరువ అయ్యేలా ఉన్నాయి. మన దేశంలో 16 ప్రాంతాలను కరోనా జోన్ ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. యూపీలోని నోయిడా, మీరట్, ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతం, కేరళలోని కాసర్గడ్, ముంబై, పూణే లాంటి ప్రాంతాలను కరోనా జోన్ హాట్ స్పాట్ ప్రాంతాలుగా గుర్తించారు. ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple