కరోనా మహమ్మారి వల్ల తెలుగు రాష్ట్రాలు కూడా అతలాకుతలం అవుతున్నాయని తెలిసిందే. ఈవైరస్ ఆర్థికంగా కూడా తీవ్ర నష్టం కల్గిస్తుంది. దాంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు అండగా నిలబడడానికి ఇప్పటికే సినీ హీరోలు, పారిశ్రామిక వేత్తలు భారీ గా విరాళాలను ప్రకటించారు. తాజాగా రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు కూడా ఇరు రాష్ట్రాలకు 10కోట్ల చొప్పున మొత్తం 20కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ నగదును ఆన్లైన్ చెల్లింపుల ద్వారా నేరుగా ముఖ్యమంత్రుల సహాయ నిధి కి టాన్స్ ఫర్ చేశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా పై పోరులో విజయం సాధించాలని..ఉభయ రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని రామోజీ రావు ఆకాక్షించారు.
కరోనా మహమ్మారి వల్ల తెలుగు రాష్ట్రాలు కూడా అతలాకుతలం అవుతున్నాయని తెలిసిందే. ఈవైరస్ ఆర్థికంగా కూడా తీవ్ర నష్టం కల్గిస్తుంది. దాంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు అండగా నిలబడడానికి ఇప్పటికే సినీ హీరోలు, పారిశ్రామిక వేత్తలు భారీ గా విరాళాలను ప్రకటించారు. తాజాగా రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు కూడా ఇరు రాష్ట్రాలకు 10కోట్ల చొప్పున మొత్తం 20కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ నగదును ఆన్లైన్ చెల్లింపుల ద్వారా నేరుగా ముఖ్యమంత్రుల సహాయ నిధి కి టాన్స్ ఫర్ చేశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా పై పోరులో విజయం సాధించాలని..ఉభయ రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని రామోజీ రావు ఆకాక్షించారు.