ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ మామూలుగా లేదు. ఒక్కసారిగా హై టెన్షన్ నెలకొంది. గత 12 గంటల్లోనే ఏకంగా 43 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 87 కేసులు నమోదు అయ్యాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుని గత పదిహేను రోజులుగా అప్రమత్తంగా ఉన్నా కేవలం నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లిన వారితోనే ఒక్కసారిగా కరోనా కేసులు హెచ్చుమీరాయి. మరోసారి పూర్తి స్థాయిలో ఆరోగ్య సర్వే చేయిస్తున్నట్టు మంత్రి బొత్స చెప్పారు. ఇక నిరంతరం పర్యవేక్షణతో పాటు అప్రమత్తంగా ఉండేలా చూస్తున్నట్టు కూడా ఆయన చెప్పారు.
ఇక ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రార్థనా సభలకు హాజరైన వారితోనే ఈ వైరస్ బయట ఎక్కువుగా వ్యాప్తి చెందినట్టు కూడా ఆయన తెలిపారు. ఇక రేషన్ విషయంలో ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. ఒక్కో డీలర్ మూడు ప్రాంతాల్లో రేషన్ సరుకులు పంపిణీ చేస్తారని చెప్పారు. ఇక ఒక పశ్చిమగోదావరి జిల్లాలోనే ఈ రోజు 14 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీరంతా కూడా ఢిల్లీ మత సభలకు వెళ్లిన వారే కావడం గమనార్హం. ఈ ఒక్క రోజే కరోనా విజృంభించి ఏకంగా 40 కొత్త కేసులు నమోదు చేసింది. ఇప్పటి వరకు సేకరించిన 373 శాంపుల్స్లో ఏకంగా 43 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇక సరికొత్త అనుమానాల ప్రకారం ఢిల్లీ వెళ్లిన వారిలో వందల మంది కరోనా అనుమానితులు ఉన్నట్టు చెపుతున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple