భార్యా భ‌ర్త‌ల సంబంధానికి అర్ధం లేకుండా పోతుంది ఈ రోజుల్లో పిల్ల‌లు, భ‌ర్త కుటుంబం విలువ‌లు, ప‌రువు వీట‌న్నిటికంటే కూడా అక్ర‌మ సంబంధాల‌కే పెద్ద పీట వేస్తున్నారు కొంద‌రు మ‌హిళ‌లు. దీని కోసం భ‌ర్త‌, పిల్ల‌ల‌ను సైతం మ‌ట్టున‌బెట్ట‌డానికి కూడా వెన‌కాడటం లేదు. కేవ‌లం ఐదు నిముషాల సుఖం ఎలాంటి ఘాత‌కానికైనా పాల్ప‌డుతున్నారు. తాజగా అక్రమ సంబంధానికి మరో ప్రాణం బలైపోయింది. వివాహ కట్టుబాట్లను కాలరాస్తూ ముగ్గురు వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత.. ప్రియుళ్లతో కలిసి భర్తను చిత్రహింసలు పెట్టింది.  ఈ ఘ‌ట‌న ఇటీవ‌లె రాజ‌స్థాన్‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే...

 

రాజ‌స్థాన్‌లో రాజ్‌కోట్‌లోని గాంధీరామ్ అనే ప్రాంతంలో ప్రహ్లాద్, ధన్‌భాయి మహేశ్వరి అనే దంపతులు నివసిస్తున్నారు. వారు కూలి పనులు చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నారు. ప్రహ్లాద్.. కూలి ప‌ని కోసం రోజూ ఉదయం వెళ్తే రాత్రికే ఇంటికి వచ్చేవాడు. దీంతో రోజంతా ఒంటరిగా ఉండే మహేశ్వరి అదే ప్రాంతానికి చెందిన ఏకంగా ముగ్గురు వ్య‌క్తులతో అక్ర‌మ సంబంధం కొన‌సాగించింది. నర్సింహ, రవిశంకర్, మహేశ్‌ అనే ముగ్గురు వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. రోజూ భ‌ర్త ప‌నిలోకి వెళ్ళ‌గానే ఆ ముగ్గురితో స‌ర‌సాలాడ సాగింది.  ఈ విష‌యం తెలిసిన భ‌ర్త ఆమెను మంద‌లించి మంచి ప‌ని కాద‌ని చెప్ప‌సాగాడు. 

 

భార్య ఈ విష‌యాన్ని త‌న ముగ్గురు ప్రియుళ్ళ‌కు చెప్పింది. దాంతో వాళ్ళు వేధించ‌డం మొద‌లు పెట్టారు. నువ్వుచాత‌గాని వాడివంటూ నీ వ‌ల్ల నీ భార్య సుఖ‌ప‌డ‌టం లేదంటూ అందుకే మ‌మ్మ‌ల్ని చూసుకుందంటూ ఇలాంటి మాట‌ల‌తో అత‌న్ని చిత్ర‌హింస‌లు చూస్తూ ఉంటారు దీంతో ఈ బాధ‌ల‌ను తాళ్ళ‌లేక అత‌ను ఇంట్లో ఉన్న క‌రెంట్ వైర్ల‌ను ప‌ట్టుకుని షాక్ కొట్టి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఇది తెలుసుకున్న త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు కోడ‌లి పై కేసు పెట్ట‌గా పోలీసులు రంగంలోకి దిగి కేసును ద‌ర్యాప్తు చేపట్టారు. వెంట‌నే భార్య‌ను అత‌ని ముగ్గురు ప్రియుళ్ళ‌ను అరెస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: