దేశ వ్యాప్తంగా కరోనా విస్తృతికి కారణమైన మర్కజ్ వివాదం సద్దుమణిగినట్లేనా?, దేశ వ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిం మతస్థులంతా వైద్య పరీక్షలకు అంగీకరించినట్లేనా ?? అంటే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అవుననే అంటున్నారు . కరోనా విస్తృతికి కారణమైన మర్కజ్ మసీదు ప్రార్థనల్లో పాల్గొన్న వందలాది మంది ముస్లిం మతస్థులు, విదేశాలకు చెందిన మతగురువులు వైద్య పరీక్షలకు ససేమిరా అనడం, క్వారంటైన్ కు నిరాకరించడంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా , అజిత్ దోవల్ ను రంగం లోకి దించారు .
ఒక దశలో ముస్లిం మతపెద్దలు , తబ్లిగ్ జమాత్ నేత మౌలానా సాద్ సైతం వైద్య పరీక్షలు , క్వారంటైన్ కు నిరాకరించారు . దీనితో ఈ సున్నితమైన సమస్య పరిష్కరించేందుకు రంగం లోకి దిగిన దోవల్ , ముస్లిం ఉలేమాలతో చర్చలు జరిపారు . మర్కజ్ మసీదు లో ఉన్న ఇతర దేశాలకు చెందిన మతపెద్దలు , దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి , క్వారంటైన్ కు తరలించే విధంగా ఉలేమాలను ఒప్పించడం లో ఆయన సక్సెసయ్యారు . మసీదు లో ఉన్న వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి, మసీదును శుభ్రం చేశారు . మర్కజ్ మసీదు నుంచి అందర్నీ ఖాళీ చేయించడం లో దోవల్ మరొకసారి తన చతురతను ప్రదర్శించి అందరి చేత శహభాష్ అన్పించుకున్నారు .
మర్కజ్ మసీదులో 216 మంది విదేశీయులుండగా వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు . విదేశాల నుంచి వచ్చిన మతగురువులు దేశం లోని ఇతర మసీదుల్లో సుమారు 800 మంది వరకుఉన్నట్లు ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తోంది . వీరికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించి , కరోనా బారిన పడినవార్ని ఐసోలేషన్ కు తరలించాలని నిర్ణయించారు .