మనుషులు తమలో కలిగే కోరికలను అదుపులో పెట్టుకోలేక, విచ్చలవిడిగా బ్రతకడానికి అలవాటు పడుతున్నారు.. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు లోకంలో చాలా పెరిగిపోతున్నాయి.. పెళ్లి చేసుకుని కాపురాలు చేసుకుంటున్న వారు కూడా ఈ ఉచ్చులో చిక్కుకుని తమ సంసార జీవితాన్ని అనవసరంగా నాశనం చేసుకుంటున్నారు.. మనిషి బ్రతికేదే తనలోని కామాన్ని చల్లార్చుకోవడానికి అన్నట్లుగా బ్రతుకుతున్నాడు.. అగ్ని సాక్షిగా కట్టిన తాళి ఎగతాళి అవుతుండగా, కడుపున పుట్టిన పిల్లలు తల్లిదండ్రుల ఆవేశం వల్ల అనాధలుగా మారుతున్నారు.. ఇకపోతే మార్చి 26వ తేదీన నల్గొండలోని అద్దంకి బైపాస్లో ఉన్న ఓ పైపుల కంపెనీ వద్ద జరిగిన హత్యకేసులో నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని మృతుని భార్య తన స్కూల్ ఫ్రెండ్తో కలిసి తన భర్తను అంతమొందించింది.. ఇక మృతుని పేరు మారం వెంకట్రెడ్డి.. 13ఏళ్ల క్రితం పానగల్కు చెందిన చాపల స్రవంతితో వివాహం జరిగింది. కాగా వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే వెంకట్రెడ్డి పెళ్లికి ముందునుండే చోరీలు, చైన్స్నాచింగ్ చేస్తూ ఆ డబ్బుతో జల్సాలు చేసేవాడు. పెళ్లయిన తర్వాత కూడా అతడిలో మార్పు రాలేదు. తరుచూ చోరీలకు పాల్పడి పోలీసులకు దొరికిపోవడంతో అతడిపై సుమారు 40 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా స్రవంతి స్కూల్ డేస్లో శేఖర్ అనే వ్యక్తిని ప్రేమించి, పెద్దల ఒత్తిడితో వెంకట్రెడ్డిని పెళ్లి చేసుకుంది. అయితే భర్త తీరుతో విసిగిపోయిన ఆమె శేఖర్తో అక్రమ సంబంధం పెట్టుకుంది..
ఈ క్రమంలో వీరి విషయం వెంకట్రెడ్డి తెలువగా గొడవలు, పంచాయితీలు కూడా జరిగాయి.. అయినా ఆమెలో మార్పు రాలేదు.. ఇక వీరిమధ్య శృంగార కోరికలు శృతిమించడంతో అడ్డుగా ఉన్న వెంకట్రెడ్డిని పధకం ప్రకారం పైపుల కంపెనీ వద్దకు తీసుకెళ్లి హత్యచేసారు.. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలు, కాల్డేటా ఆధారంగా హత్య మిష్టరీని చేధించారు. నిందితులైన పానగల్కు చెందిన మున్నా శేఖర్, మృతుడి భార్య చాపల స్రవంతి, శ్రీరామ్నగర్ కాలనీకి చెందిన విశ్వనాథుల ఈశ్వర్ అలియాస్ చింటు, దుంపల సాయికుమార్లను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
చూశారా భర్త బాధ్యత లేకుండా ప్రవర్తించడం, భార్య కూడా తన కోరికలను అదుపులో పెట్టుకోకపోవడం వల్ల ఒకరు మరణించగా, ఆ కామపిశాచి జైలుపాలవడంతో వారి ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు.. కోరికలు అదుపుతప్పితే జీవితం నవ్వులపాలవుతుందని ఈ ఘటన నిరూపిస్తుంది..