ఏపీలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో బాధితుల సంఖ్య 111కు చేరింది. ఈరోజు రాష్ట్రంలో మరో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 115కు చేరింది. ఈరోజు ప్రకాశం జిల్లా చీరాలలో రెండు కేసులు, చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తిలో రెండు కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూ ఉండటం ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తుంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు తక్కువ సంఖ్యలో కేసులు నమోదైనప్పటికీ రాత్రికి కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు జిల్లాలలో మాత్రం కరోనా ప్రభావం తక్కువగా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
కర్నూలులో ఇప్పటివరకూ కేవలం ఒక కేసు మాత్రమే నమోదైంది. పశ్చిమ గోదావరి, కడప, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టినా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఢిల్లీలోని మర్కజ్ కు హాజరైన వారే ఎక్కువగా కరోనా భారీన పడుతున్నారు. మరికొంతమంది నమూనాలకు సంబంధించిన నివేదికలు అందాల్సి ఉంది.
రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. లాక్ డౌన్ విషయంలో మరిన్ని కఠిన నిర్ణయాలను అమలు చేస్తోంది. జనం గుంపులు గుంపులుగా గుమికూడకుండా మరింత కఠినంగా నిబంధనలను అమలు చేయాలని ప్రభుత్వం అధికారులకు, పోలీసులకు సూచించింది. ఈరోజు నుంచి అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి విషయంలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించనున్నారని సమాచారం అందుతోంది.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple