ఆంధ్రప్రదేశ్లో కరోనా కోరలు చాస్తోంది. రోజురోజుకూ వైరస్ చాపకింద నీరులా రాష్ట్రంలో విస్తరిస్తోంది. మొన్నటి వరకు అంతా అదుపులోనే ఉందునుకుంటున్న తరుణంలో ఏపీపై ఢిల్లీ జమాతే నుంచి పిడుగుపడింది. ఏపీ నుంచి జమాతేకు వెళ్లిన 108 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఢిల్లీలోని జమాతేలో నిర్వహించిన ప్రార్థనలకు రాష్ట్రం నుంచి మొత్తం 1085 మంది హాజరయ్యారు.
881 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 108 మందికి పాజిటివ్ రావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. జమాతే వెళ్లిన కుటుంబ సభ్యులు 613 కి పరీక్షలు నిర్వహించగా 32 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 161 పాజిటివ్ కేసుల్లో జమాతే కేసులు 140 ఉండటం గమనార్హం. పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో అధికారులు మరింత అప్రమత్తం అ య్యారు. లాక్డౌన్ ను మరింత కఠినతరం చేసేందుకు సిద్ధం అయ్యారు.