కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విషయంలో రేసెంటుగా స్పందించిన మన ప్రధాని నరేంద్ర మోడీ... లాక్ డౌన్ ను వివిధ దశల వారీగా తొలగించ వలసి ఉంటుందని చెప్పిన విషయం అందరికి విదితమే... ఈ నేపథ్యంలోనే... మోడీ... దేశమంతా ఐకమత్యంతో కరోనాను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు, లైట్ ఆర్పివేసి సంఘీభావం తెలుపాలని కోరిన నేపథ్యంలో జనులు సోషల్ మీడియాలో రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు.
ఉదాహరణకు... ఒకరు, ఆదివారం దేశానికి దీపావళి అని, మరొకరు... ఈ ఆదివారం మీ ఇంటికి హ్యాపీ డెంట్ యాడ్ రాబోతోందని, ఇంకొకరు.. వీధి ద్విపాల వెలుగులో చదివి.. జేకే రౌలింగ్ లాగా హ్యారీపోటర్ నోవెల్ రాసేయండి అని... ఇలా ఎవరికి తోచిన క్రియేటివిటీని వారు వివిధ రకాలుగా... మీమ్స్, విజువల్ కామెంట్లు రూపంలో చేరవేయగా... ఇది ఎట్టకేలకు కేంద్రం అధిష్ఠానము గుర్తించినట్లుంది...
ఈ మేరకు మన ప్రియతమ ప్రధాని సోషల్ మీడియా హీరోలకు ఓ స్వీట్ వార్ణింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే... ఈ గడ్డు పరిస్థితులలో జాగ్రత్తలు పాటించవలసింది పోయి... బాధ్యతను మరిచి, ఈ కార్యక్రమాన్ని ఫన్నీ గా తీసుకునే యువత పట్ల మోడీ ఒకింత అసహనాన్ని వ్యక్త పరిచినట్లు వారి రాజకీయ సన్నిహితులు గుసగుసలు ఆడుకుంటున్నారు.
చీకటి రాత్రిలో వీధి స్తంభం పైన ఓ వ్యక్తి నిలబడి, లైట్ వెలిగించి పట్టుకున్నట్లు... వేరొకరు ఓం బత్తి, దీపం కొనండని... మరొకరు... భగవంతునికి, భక్తునికి అనుసంధానం అయినది ఈ లైట్ అని.... అలాగే ఈ ఏప్రిల్ నెలలో దేశం దీపావళిని చేసుకోబోతుందా అని వెటకారంగా... పోస్ట్ చేసారు... ఇంకో ఆకతాయి రాత్రి 9 గంటలకు ఇండియా ఇలా ఉండబోతుందని నాసా ఫోటో మాదిరి ఫోటోను ఎడిట్ చేసి పోస్ట్ చేసారు... ఇలా ఎవరికి తోచిన కళలను వారు చూపిస్తున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple: https://tinyurl.com/NIHWNapple