దేశంలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజాముద్దీన్ మర్కజ్ కు లింక్ ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. తెలంగాణ నుంచి మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారంతా తిరిగి తెలంగాణకు రావడంతో కేసులు పెరిగిపోతున్నాయి. నిజాముద్దీన్ నుంచి వచ్చిన వీరందరూ ఎక్కడెక్కడ ఉన్నారు...అనే విషయాలను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. తెలంగాణలో మొత్తం ఆరు ప్రాంతాల్లో వీరు ఉన్నట్టుగా గుర్తించింది. హైదరాబాద్ నుంచి కూడా మర్కజ్కు వందల సంఖ్యలో హాజరవడంతో నగర వాసులు భయం భయంగా గడుపుతున్నారు.
నగరం నుంచి మర్కజ్కు వెళ్లొచ్చిన వారి వివరాలను సేకరిస్తున్నాని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఇప్పటికే 80 శాతం మందిని గుర్తించామని చెప్పారు. కరోనా వ్యాప్తి జరగకుండా ప్రతి పౌరుడు బాధ్యతగా ఉండాలని.. ఢిల్లీ నిజాముద్దీన్లోని మర్కజ్లో ప్రార్థన వెళ్లి వచ్చిన వారు స్వచ్చందంగా వచ్చి వైద్య సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇక నగరంలోని వీధి కుక్కలకు ఎంటమాలజీ విభాగం ద్వారా ఆహారం ఆందిస్తామని మేయర్ చెప్పారు. అలాగే, 1500 మంది యాచకులకు భోజనం అందిస్తున్నామని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు రవాణా, వసతి కల్పిస్తున్నామని రామ్మోహన్ చెప్పారు. అయితే తెలంగాణలో భైంసా, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్ పాతబస్తీ, గద్వాల్, మిర్యాలగూడ ప్రాంతాలను హాట్ స్పాట్ గా గుర్తించామని అంటున్న విషయం తెలిసిందే.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple