కరోనా వైరస్ లేదా కోవిడ్-19.. ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట చైనాను వణికించిన ఈ మహమ్మారి ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాలను వణికిస్తోంది. ఇక మూడు అక్షరాలే అయినా ముచ్చెటమలు పట్టిస్తోంది. ఈ రక్కసిని అరికట్టేందుకు ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్ని అలెర్ట్ అయ్యాయి.. దాదాపుగా అన్ని దేశాలలో లాక్ డౌన్ తో స్తంభించిపోయాయి. అయినప్పటికీ కరోనా పాజిటివ్ సంఖ్య మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడినవారి సంఖ్య పది లక్షలు దాటింది.
ఒక్క ఐరోపా ఖండంలోనే 5 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోని 200 దేశాలకు కరోనా వైరస్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇక కరోనా కారణంగా 187 దేశాల్లో 53 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ లెక్కలు చూస్తుంటే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాని, వైద్యారోగ్య, పోలీసు శాఖ ఉద్యోగులు మాత్రం కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు తమ ప్రాణాలు పెట్టి మరీ పోరాడుతున్నాయి.
అయితే ఇలాంటి వారికి సాయం చేయాల్సింది పోయి ఏకంగా మెడికల్ సిబ్బంది కోసం తెచ్చిన క్వాలిటీ మాస్క్లను వీఐపీల పేరుతో వైసీపీ నాయకులు కొట్టేశారని టీడీపీ ఆరోపించింది. ఈ మేరకు టీడీపీ నేత, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ వెల్లడించాడు. ఈ క్రమంలోనే జగన్ గారి బాటలోనే వైసీపీ నాయకులు నడుస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా 420 బుద్ధులు వదులుకోలేకపోతున్నారు. డాక్టర్లకి ఇచ్చిన మాస్కులను వీఐపీలమంటూ వైసీపీ నాయకులు కొట్టేయ్యడం దారుణం అని నారా లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అక్కడితో ఆగని లోకేష్.. వైసీపీ నాయకులు బాగుంటే చాలు వైద్య సిబ్బంది, ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple