కరోనా వైరస్.. భారత్ లో రోజు రోజుకు పెరిగిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ కరోనా వైరస్ పాజిటివ్ లు మరి ఎక్కువ అయిపోతున్నాయి.. ఇప్పటికే 154 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా ఇప్పుడు తాజాగా మరో 75 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్కసారిగా తెలంగాణ ప్రజలు షాక్ అయ్యారు.
ఇకపోతే కరోనా వైరస్.. తెలంగాణను కబళిస్తుంది. తాజాగా నమోదైన 75 కరోనా వైరస్ కేసులతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 229కి చేరింది. అంతేకాదు ఈరోజు కరోనా పాజిటివ్ తో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో 9గా ఉన్న కరోనా మృతుల సంఖ్య ఇప్పుడు 11కు చేరుకుంది. అంతేకాదు మరో 15 మంది కరోనా వైరస్ ను జయించారు.. దీంతో ఇప్పటి వరుకు 32 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇకపోతే ఈ కరోనా వైరస్ కేసులు భారత్ లో రోజు రోజుకు శృతిమించుతున్నాయ్. ఇప్పుడు 75 కరోనా పాజిటివ్ కేసులతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 2,974కు చేరింది. ఇంకా అందులో 221 మంది కరోనా బారి నుండి కోలుకోగా మొత్తం 77 మంది కరోనా పాజిటివ్ తో మృతిచెందారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 10 లక్షలమంది కరోనా వైరస్ బారిన పడ్డారు. అందులో 55 వేలమంది మృతి చెందగా 2 లక్షల 22 వేలమంది కరోనా బారి నుండి బయటపడ్డారు. ఇంకా మన భారత్ లో కరోనా వైరస్ కేసులు తక్కువ నమోదయినప్పటికీ అమెరికా, ఇరాన్, ఇటలీ వంటి దేశాల్లో ఈ కరోనా వైరస్ విళయతాండవం చేస్తుంది.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple