కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికించేస్తోంది. ఎటువంటి వ్యాక్సిన్ లేని ఈ కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తూ అందరిని చంపుకుంటూ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ బారిన ఇప్పటికే 10 లక్షలమంది పడ్డారు. అందులో 55 వేలమంది మృత్యువాత పడ్డారు. అలంటి ఈ కరోనా వైరస్ భారత్ లో కూడా విజృంభిస్తుంది. 

 

అయితే ఈ కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్రప్రభుత్వం 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. దీంతో ప్రజలు ఎవరు కూడా బయటకు రాకుండా అందరూ కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే ఇంకా ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించాలి అని చెప్పారు. అయితే దీపాల వెనుక ఓ జ్యోతిష్యశాస్త్ర ఆంతర్యం ఉంది అని వాట్సాప్ లో తెగ ఫార్వార్డ్ అవుతుంది. దీంతో ఆ మెసేజ్ వైరల్ అవుతుంది. ఆ మెసెజ్ ఏంటి అనేది మీరు కూడా చదివి తెలుసుకోండి. 

 

''ప్రతీ ఒక్కరికి విన్నపం..  

 

ప్రధాన మంత్రి గారు చెప్పిన విషయం లో జ్యోతిష్యశాస్త్ర రీత్యా ఆంతర్యం... 

 

05-2020- రాత్రి 9 గంటలికి 9 నిముషాలపాటు దీపం వెలిగించాలి.

 

అంటే 5+2+0+2+0=9

 

రాత్రి 9కి 9నిముషాలు

 

అంతా 9 

 

అమ్మవారి సంఖ్య 

 

ఇంకొక విషయం... ఆ రోజు ఆదివారం మరియు వామన ద్వాదశి, మఖ, పుబ్బ నక్షత్రము లు (సింహరాశి) లో సంచరించున్న సమయంలో దీపం పెడితే సూర్య గ్రహానికి సంబంధించిన వారం, రాశి కనుక భారతదేశంలో ఉన్న ప్రజలంతా ఆరోగ్యం కుదుట పడి చెడు దగ్దం అవుతుంది అని శాస్త్ర వచనం. అమ్మవారి ఉపాసన మార్గంలో ఉండేవారికి అర్ధం అవుతుంది. అందుకని అందరూ ఖచ్చితంగా నెయ్యి దీపం పెట్టండి.. శుభం కలుగుతుంది''. అంటూ సోషల్ మీడియాలో ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. నిజం అని నమ్మి ప్రజలంతా కూడా నెయ్యి కొనడానికి లాక్ డౌన్ ఉల్లఘించి మరి బయటకు వస్తున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: