ప్రస్తుతం కరోనా వైరస్ ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఈ సమయంలో రాజకీయాలు కాకుండా ప్రపతిపక్షాలు కూడా సాయం చెయ్యాల్సిన సమయం ఇది. అలాంటి ఈ సమయంలో చంద్రబాబు కరోనా ను కూడా రాజకీయం చెయ్యాలి అని చూశాడు.. దీంతో పాలకపక్షాలు ఆరోజు నుండి చంద్రబాబుని తిట్టి తిట్టి పెడుతున్నారు.
ఇంకా ఈ నేపథ్యంలోనే వైసీపీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ అధ్యక్షుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగాలని ఎవరైనా కోరుకుంటారా ? మనిషి జన్మ ఎత్తిన వారెవరూ అలా కోరుకోరు అని.. చంద్రబాబు, ఎల్లో మీడియా, ప్యాకేజీ జీవులు మాత్రం శాడిస్టిక్ భ్రమల్లో ఉన్నారని అయన వ్యాఖ్యానించారు.. సీఎం జగన్ కరోనా ను నియంత్రణలో విఫలమయ్యారని నింద వెయ్యడానికే ఇలా చేస్తున్నారు అంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
మరో ట్విట్ లో.. ''కృష్ణానదికి వరదొస్తే కరకట్ట కొంప మునుగుతుందేమోనని రాత్రికి రాత్రి హైదరాబాద్ పారిపోయాడు. కరోనా వైరస్ ప్రబలుతుందనగానే పెట్టేబేడా సర్దుకుని ముందే పొరుగు రాష్ట్రం చేరాడు. మూడడుగుల దూరం పాటించమంటే మూడొందల కిలోమీటర్లు పారిపోయిన నువ్వు సుద్దులు చెప్పటమేంటీ బాబూ? కర్మ కాకపోతే!'' అంటూ ఏకిపారేశారు. దీంతో ఈ ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple
కృష్ణానదికి వరదొస్తే కరకట్ట కొంప మునుగుతుందేమోనని రాత్రికి రాత్రి హైదరాబాద్ పారిపోయాడు. కరోనా వైరస్ ప్రబలుతుందనగానే పెట్టేబేడా సర్దుకుని ముందే పొరుగు రాష్ట్రం చేరాడు. మూడడుగుల దూరం పాటించమంటే మూడొందల కిలోమీటర్లు పారిపోయిన నువ్వు సుద్దులు చెప్పటమేంటీ బాబూ? కర్మ కాకపోతే!
— Vijayasai reddy v (@VSReddy_MP) April 3, 2020
రాష్ట్రంలో కరోనా కేసులు పెరగాలని ఎవరైనా అనుకుంటారా? మనిషి జన్మ ఎత్తిన వారెవరూ అలా కోరుకోరు. ఎల్లో మీడియా, చంద్రబాబు, ప్యాకేజీ జీవులు మాత్రం ఇటువంటి శాడిస్టిక్ భ్రమల్లో ఉన్నారు. సిఎం జగన్ గారు వ్యాధిని నియంత్రించడంలో విఫలమయ్యారని నింద వేసేందుకు కాచుక్కూర్చున్నారు.
— Vijayasai reddy v (@VSReddy_MP) April 3, 2020