కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా శనివారం అప్డేట్స్ చూస్తే కరోనా బాధితుల సంఖ్య 11 లక్షలకు చేరువ అవుతోంది. ఇక కరోనా మరణాలు సైతం 60 వేలకు చేరుకున్నాయి. గత 24 గంటల్లోనే ఏకంగా 84 వేల కేసులు నమోదు అయితే.. గత 24 గంటల్లోనే ఏకంగా 5500 కేసులు నమోదు అయ్యాయి. మనదేశంలో కరోనా గత మూడు రోజుల్లో విజృంభించడంతో ఏకంగా కేసులు 3 వేలకు చేరుకుంది. ఇక దేశవ్యాప్తంగా 84 మంది ఈ వ్యాధి సోకి మృతి చెందారు. ఇక మన దేశంలో ఢిల్లి నిజాముద్దీన్కు వెళ్లి వచ్చిన వారి సంఖ్య అన్ని రాష్ట్రాల్లో ఎక్కువుగా ఉండడంతో పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదు అవుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా శనివారం ఉదయం 7 గంటల అప్డేట్స్ ఇలా ఉన్నాయి...
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 10, 98, 006
మృతుల సంఖ్య - 59, 141
రికవరీ కేసుల సంఖ్య - 2, 28, 405
యాక్టివ్ కేసుల సంఖ్య - 8, 10, 460
క్లోజ్డ్ కేసుల సంఖ్య - 2, 87, 546
వరల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు
అమెరికా - 2, 77, 161 - 7392
ఇటలీ - 1, 19, 827 - 14, 681
స్పెయిన్ - 1, 19, 199 - 11, 198
భారత్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 3053
ఇండియాలో గత 24 గంటల్లో 508 కొత్త కేసులు నమోదు
మృతులు - 84
తెలంగాణలో కేసులు - 229
తెలంగాణ మృతులు - 11
శుక్రవారం పాజిటివ్ కేసులు - 75
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు
ఏపీలో కేసులు - 164
అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 32 కేసులు
ఏపీలో మృతులు - 1
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు