ఇప్పటి వరకు ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు కొనసాగుతన్నాయి.  ప్రపంచంలోని అగ్ర రాజ్యమైన అమెరికా సైతం ఈ కరోనా మహమ్మారి బీభత్సాన్ని తట్టుకోలేకపోతుంది.  ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాక్సిన్ కంపెనీ భారత్ బయోటెక్‌కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.  

 

తెలుగు రాష్ట్రాల సంతోషించదగ్గ విషయం తెలిపారు. కరోనా వైరస్ ను నిరోధించేంందు కోరోఫ్లూ అనే పేరుతో వాక్సిన్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్న మన హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్‌కు నా బెస్ట్ విషెస్. సీఎమ్‌డీ డాక్టర్ కృష్ణ ఎల్లా, ఆయన టీమ్‌కు గుడ్‌ లక్. మీ అందరూ విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని కేటీఆర్ ఈ రోజు ఉదయం ట్వీట్ చేశారు. కరోనాకు వ్యాక్సిన్‌ తయారు చేయడం కోసం విస్కాన్‌సిన్-మాడిసన్ యూనివర్సిటీ, వ్యాక్సిన్ కంపెనీ ఫ్లూజెన్‌తో చేతులు కలిపినట్టు భారత్ బయోటెక్‌ తెలిపింది.

 

ఫ్లూజెన్ కంపెనీకి చెందిన  ఫ్లూ వ్యాక్సిన్ ఆధారంగా కరోనా కోసం టీకాను తయారు చేసే పనిలో ఉన్నామని చెప్పింది. ఫేజ్ 1, ఫ్లేజ్ 2 క్లినికల్ పరీక్షల దశలో ఉందని కంపెనీ బిజినెస్ డెవలప్‌మెంట్ అధిపతి రాచెస్ ఎల్లా తెలిపారు.  ‘కోరోఫ్లూ’ వ్యాక్సిన్‌పై యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్‌సిన్- మాడిసన్‌ వైరాజిస్టులు జంతువులపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక వ్యాక్సిన్‌ పూర్తి స్థాయిలో అందుబాటులో వచ్చేందుకు దాదాపు ఏడాది సమయం పట్టొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: