దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు రోజు రోజుకు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. క‌రోనా దెబ్బ‌తో నార్త్ టు సౌత్ అన్ని రాష్ట్రాల్లోనూ గంట గంట‌కు కేసులు పెరిగి పోతున్నాయి. ఇక ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ముందుగా జ‌న‌తా క‌ర్ఫ్యూ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఏకంగా 21 రోజుల పాటు ఆయ‌న లాక్ డౌన్ అమ‌లు పాటించాల‌ని పిలుపు ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఈ నెల 8వ తేదీన అఖిల‌ప‌క్షం స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం అమ‌ల్లో ఉన్న లాక్‌డౌన్ ఈ నెల 14వ తేదీ వ‌ర‌కు కంటిన్యూ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ లాక్ డౌన్‌ను 14 నుంచి ద‌శ‌ల వారీగా ఎత్తివేయాల‌ని కూడా నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. 

 

ఈ క్ర‌మంలోనే దేశంలోని ఇత‌ర పార్టీల అభిప్రాయం కూడా తీసుకునేందుకు మోదీ ఈ నెల 8వ తేదీన ఉద‌యం 11 గంట‌ల‌కు ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ అఖిల‌ప‌క్ష స‌మావేశంలో ఇత‌ర పార్టీల నాయ‌కుల‌ను కూడా ఆహ్వానించి లాక్ డౌన్ ఎత్తివేత‌తో పాటు ఇత‌ర‌త్రా అంశాలు.. లాక్ డౌన్ ఎత్తివేశాక కూడా ఏం చేయాల‌నే దానిపై వారి అభిప్రాయాలు.. స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించ‌నున్నార‌ని స‌మాచారం. అయితే అదే రోజున మోదీ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌ని అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: