ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఒకటే కరోనా వైరస్. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను చిగురుటాకులా వణికిస్తోంది  ఈ వైరస్ పై విజయం సాధించేందుకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎంతో మంది ప్రజలు ఈ వైరస్ ను  జయించలేక మృత్యువు ఒడిలోకి వెళ్ళిపోతున్నారు. కనిపించని శత్రువుతో పోరాటం చేయలేక ప్రాణాలు వదులుతున్నారు. రోజురోజుకు విజృంభిస్తున్న ఈ వైరస్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ ప్రాణభయంతో బతుకుతున్నారు. ఎవరి నుండి ఈ మహమ్మారి వైరస్ సోకి ప్రాణాలను హరించుకుపోతుందో  అనే ప్రశ్నార్ధక జీవితాన్ని గడుపుతుంది ప్రపంచం మొత్తం. 

 

 

 అయితే ఆయా దేశాల ప్రభుత్వాలు కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఎన్నో కీలక నిర్ణయాలు కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చి కరోనా  వైరస్ ను కట్టడి చేసేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ మహమ్మారి వైరస్ మాత్రం రోజురోజుకూ విజృంబిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే ఓవైపు ప్రభుత్వాలు ఎంతో మంది ప్రముఖులు ఈ మహమ్మారి వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు సోషల్ మీడియాలో ప్రజలను అయోమయంలో పడవేసే విదంగా ఎన్నో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కొంతమంది ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

 

 

 ఈ క్రమంలోనే తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక మెసేజ్ ఆసక్తికరంగా అందరిని ఆలోచింప చేసే విధంగా ఉంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయి నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ మెసేజ్ లో ఉన్నది ఏమిటి అంటే... ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటున్న కరోనా  వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు ఎందుకు రాలేదు అని ఓ భక్తుడు దేవున్ని  ప్రశ్నించాడట. అందుకు సమాధానంగా దేవుడు... నేను ప్రధానమంత్రి రూపంలో, ముఖ్యమంత్రి రూపంలో, పోలీస్ రూపంలో, డాక్టర్ ల రూపంలో వచ్చాను అంటూ సమాధానమిచ్చాడట. నేను ఇన్ని రూపాలలో వచ్చి మిమ్మల్ని కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే మీరేమో నిర్లక్ష్యంగా రోడ్ల మీద తిరుగుతూ మృత్యువును ఆహ్వానిస్తూ ఉన్నారు. మళ్లీ నన్ను కాపాడడం లేదు అని ప్రశ్నిస్తారేంటయ్యా అంటూ  దేవుడు సమాధానమిచ్చాడు అంటూ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ వైరల్ అవుతు అందరిని  ఆలోచింప చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: