తెలంగాణలో క‌రోనా వైర‌స్ విశ్వ‌రూపం చూపుతోంది. రాష్ట్రంలో వైర‌స్ వేగంగా విస్త‌రిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 24 జిల్లాల‌కు వైర‌స్ విస్త‌రించింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 272 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌డం క‌ల‌క‌లం  రేపుతోంది. నిన్న ఒక్క రోజే కొత్త‌గా 43 కోరానా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌డం ఆం దోళ‌న క‌లిగిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 11 మంది వైర‌స్ బారినప‌డి చనిపోగా, 33 మంది ద‌వాఖాన‌ల్లో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. ఒక్క హైద‌రాబాద్‌లోనే 111 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌డంతో స్థానికులు భ‌య‌బ్రాంతుల‌కు గుర‌వుతున్నారు.  ఇందులో ఢిల్లీ మ‌ర్క‌జ్‌తో సంబంధం ఉన్న కేసులే అధికంగా ఉండ‌టం గ‌మ‌నార్హం.  అలాగే మ‌ర్క‌జ్‌నుంచి వ‌చ్చిన వారితో కాంట్రాక్ట్ అయిన సుమారు 3300 మందికి రానున్న ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నామ‌ని, అందులో సుమారు 600 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: