ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ ని కట్టడి చేయలేక దేశాలు నరకం చూస్తున్నాయి. రోజు రోజుకి గంట గంటకు కరోనా సునామి అన్ని దేశాలను ముంచుతుంది. దేశ ఆర్ధిక వ్యవస్థలు కూడా కుప్పకూలిపోతున్నాయి అనే విషయం అర్ధమవుతుంది. లాక్ డౌన్ ప్రకటించినా ఎం చేసినా సరే కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 12 లక్షలకు చేరువలో కరోనా కేసులు ఉన్నాయి.
ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం... 1,203,188 మందికి కరోనా వైరస్ సోకగా వారిలో 64,747 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 246,760 మందికి కరోనా నయం అయింది. 891,681 మంది కరోనాతో పోరాడుతున్నారు. వారిలో 847,585 (95%) మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. 44,096 (5%) మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వీరిలో 31 వేల మంది మరణం అంచున ఉన్నారు.
311,637 మంది అమెరికాలో కరోనా బారిన పడ్డారు. వీరిలో దాదాపు 7 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 3 వేలు దాటాయి.. ఇక మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. నిన్న ఒక్క రోజే 601 మందికి కరోనా వైరస్ సోకుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో 200 మందికి తెలంగాణా 272 మందికి కరోనా బారిన పడ్డారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNappl