ప్రస్తుత రోజుల్లో యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో కింద పైన అవుతుంది. ఇక కరోనా వైరస్ పై అలుపెరగని పోరాటం చేస్తున్నందుకు, ప్రజలంతా ఒకేతాటిపై నడుస్తున్నామని ప్రపంచానికి తెలిపేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒక వినూత్న కార్యక్రమానికి తేరా తీసిన సంగంతి తెలిసిందే. అయితే భారత దేశ ప్రజలంతా ఒంటరి వారు కారని, తామంతా కలిసి ఒక్కటేనని, తమ ఔనత్యాన్ని సమగ్రతను చాటి చెప్పాలని, అందుకు గాను నేడు ఆదివారం రాత్రి సరిగ్గా 9 గంటల సమయంలో 9 నిమిషాల పాటు ఇంట్లో లైట్స్ ఆఫ్ చేసి దీపాలను వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించిన సంగతి మనందరికీ తెలిసిందే.
@BJP4Andhra @JanaSenaParty pic.twitter.com/kiExWC0hza
— pawan Kalyan (@PawanKalyan) April 3, 2020
అయితే ఇప్పుడు ప్రధాని మోదీ ఇచ్చిన ఈ సందేశానికి అన్ని రంగాల పెద్దలు, సినీ స్టార్లందరూ తమ మద్దతును ప్రకటిస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ అని ప్రత్యేక తేడా లేకుండా అందరూ ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయితే ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్, రంగోలీ చందేల్ ఆదివారం రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించాలని వర్రు వారి అభిమానులకి తెలిపారు. ఈ మెగా పనికి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు సైతం ప్రధాని మోడీ నిర్ణయానికి వారు జై కొట్టి స్వాగతించారు.
Well pointed.
— narendra modi (@narendramodi) April 4, 2020
Follow the lockdown.
Spread brightness.
Together we will all defeat COVID-19. #IndiaFightsCorona https://t.co/IyakhwYrwI
నెట్టింట్లో తాజాగా రామ్ చరణ్ సైతం కూడా ప్రధాని మోడీ నిర్ణయానికి మద్దతు తెలియపరుస్తూ.. ఒక వీడియో సందేశాన్ని తను రిలీజ్ చేశాడు. భారతీయులందరు ప్రధాని మోదీ చెప్పినట్టు ఆదివారం రాత్రి 9 గంటల నుంచి తొమ్మిది నిమిషాల పాటు ఇంట్లోని లైట్స్ ఆర్పి వేసి దీపాలు వెలిగిద్దామని ఆయన అభిమానులకు సూచించాడు. ఆ ట్వీట్ లో మనమందరమూ కలిసి కరోనా లేని భారతాన్ని చూద్దామని అకాంక్షించాడు. రామ్ చరణ్ చేసిన ట్వీట్ పై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. "ప్రధాని మోడీ నిర్ణయాన్ని సమర్థించినందుకు థాంక్యూ రామ్ చరణ్ గారూ".. అంటూ ట్వీట్ ని షేర్ చేస్తూ తెలిపాడు.