కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ విషయంలో దేశానికి మరో తీవ్రమైన ప్రమాదం పొంచిఉంది. అదేమిటంటే ఏప్రిల్ 8, 9 తేదీల్లో ముస్లింలు పవిత్రంగా భావించే  ’షబ్బే బరాత్ జాగ్నేకీ రాత్’  వస్తోంది. ఈ రెండు రోజులు ముస్లింలు పెద్ద ఎత్తున పండుగ జరుపుకునే రోజులన్న విషయం అందరికీ తెలిసిందే. పండుగ వాతావరణం అంటే మరి ఒకరింటికి మరొకరు వెళ్ళటం, వంటలను ఇచ్చిపుచ్చుకోవటం సాధారణమే కదా ? ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో దేశంలో ప్రమాకర పరిస్దితిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

 

నిజానికి వారం రోజులు క్రితం దేశంలో వైరస్ ఇంత ప్రమాదకరంగా లేదు. మార్చి 1—5 వ తేదీల మధ్య ఢిల్లీలోని మర్కజ్ మసీదులో జరిగిన ప్రార్ధనలకు దేశం మొత్తం మీద 12 వేలమంది పాల్గొన్నారు. వీళ్ళంతా తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళిన తర్వాత నుండే వైరస్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దేశంలో నమోదైన 3100 కేసుల్లో మర్కజ్ కేసులే సుమారు వెయ్యికిపైగా ఉండటం గమనార్హం.

 

ఈ సమస్యే నుండి ప్రభుత్వాలు బయటపడలేక నానా అవస్తలు పడుతున్న సమయంలో మళ్ళీ ఏప్రిల్ 8, 9 తేదీల్లో ముస్లింలు బయటకు వస్తే ఇంకేమైనా ఉందా ? అని ప్రభుత్వాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అందుకనే లాక్ డౌన్ అమలవుతున్న సందర్భంలో ముస్లింలెవరూ పై రెండు రోజులు రోడ్ల మీదకు రావద్దని, ప్రార్ధనల పేరుతో ఒకచోట చేరవద్దని ఢిల్లీ పోలీసులు పదే పదే అప్పీలు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవటం ఖాయమని కూడా హెచ్చరిస్తున్నారు. పైగా ముస్లింలను హెచ్చరిస్తు ఢిల్లీ పోలీసులు ఢిల్లీలో పోస్టర్లను అంటించారు కూడా.

 

అంతా బాగానే ఉంది. పోలీసుల హెచ్చరికలను ముస్లింలు వింటారా అన్న విషయంలోనే  అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది.  నిజానికి ప్రభుత్వ ఆదేశాలను పాటించే వాళ్ళ సంఖ్యే ఎక్కువగా ఉంది. కాకపోతే ఉల్లంఘించే వాళ్ళ వల్లల సమస్యంతా వస్తోంది. ఢిల్లీ పోలీసులు అప్పీలు చేస్తున్నారు బాగానే ఉంది. మరి మిగిలిన దేశం మాటేమిటి ? దేశవ్యాప్తంగా కోట్లమంది ముస్లింలున్నారు. మరి వాళ్ళంతా ఏమి చేస్తారో ఏమో ? పోలీసులు చెప్పినట్లుగా  పై రెండు రోజుల్లో ముస్లింలెవరూ రోడ్లపైకి రాకపోతే అదే పెద్ద రిలీఫ్.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: