అవును.. ఇది నిజమో కాదు తెలీదు.. కానీ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఏదైనా ఆశ్చర్యకరమైన విషయం జరిగింది అంటే.. ఎప్పుడైనా ఓ 15మంది ఒకేసారి ప్రాణాలు విడిచారు అంటే చాలు .. కాలజ్ఞాని బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అని ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు.. 

 

నిజానికి అయన చెప్పిన కాలజ్ఞానం ఎప్పుడు కూడా ఘటన జరగకముందు బయటకు రాదూ.. ఘటన జరిగిన తర్వాత అప్పుడే ఈ ఘటన గురించి కాలజ్ఞాని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. ఇంకా ఇప్పటికే కరోనా వైరస్ గురించి కాలజ్ఞాని అప్పుడే చెప్పారు అని ఇదివరకెప్పుడో ప్రింట్ అయిన ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. 

 

ఇంకా ఇప్పుడు ఈ కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించడంతో కేంద్ర ప్రభుత్వం 21 రోజులు పాటు ఏప్రిల్ 14వ తేదీ వరుకు ఎవరు బయటకు రాకూడదు అని లాక్ డౌన్ విధించింది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంకా ఎప్పుడు రద్దీగా ఉండే తిరుమల సైతం ఖాళీగా ఉంది.. దీంతో ఓ వరాహం రోడ్డుపైకి వచ్చి తినడానికి ఏమైనా దొరుకుతుందా అని వెతుకుతుంది. 

 

దాన్ని వీడియో తీసిన ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తిరుమల వీధిలో వరాహం తిరిగే అని బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు.. ఇప్పుడు తిరుగుతుంది అంటూ పోస్ట్ చేశారు.. దీంతో ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ ని నమ్మాలో తెలీదు.. నమ్మకూడదో తెలీదు. అయినా మనుషులు ఎవరు లేకపోతే రోడ్డుపైకి ఏంటి ? ఇళ్లలోకి కూడా వస్తాయి.. 

 

ఇప్పటికే కేరళలో.. కనువిను ఎరగని పక్షులు.. జంతువులు అన్ని రోడ్లపైకి వచ్చి అలరిస్తున్నాయి. మనుషులు.. అడవిని ఇల్లు, రోడ్లు చేసి జంతువులు ఉండాల్సిన ప్రదేశాన్ని మనిషికి అనుకూలంగా మార్చుకున్నారు.. అందుకే మనుషులు ఎవరు లేకపోయేసరికి అవి అన్ని బయటకు వచ్చి ప్రశాంతంగా తిరుగుతున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: