దేశం మొత్తం కూడా ఇప్పుడు ఢిల్లీ మత ప్రార్ధనల కు వెళ్లి వచ్చిన వారి విషయం లో చాలా ఆగ్రహంగా ఉంది. రాను రాను ఆంధ్రప్రదేశ్ లో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి అంటే వాళ్ళే దానికి ప్రధాన కారణం అనే విషయం అర్ధమవుతుంది. అలాంటిది ఇప్పుడు జగన్ వాళ్ళను పొగిడారు. దేశంలో అన్ని ఆధ్యాత్మిక కేంద్రా ల్లో ఇలాంటి చర్యలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయని దానికు ఎవరూ తప్పు కాదని నిందించవద్దు అంటూ సలహా ఇచ్చారు. 

 

ఆయన ఆ మాట మాట్లాడిన వెంటనే అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయి లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరగడానికి వాళ్ళు కారణం... వాళ్ళను ప్రభుత్వం రావాలని చికిత్స చేయించుకోవాలి అని కోరినా సరే వాళ్ళు మాత్రం ముందుకి వచ్చి చికిత్స చేయించుకోవడం లేదు. దీనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తెలంగాణా సర్కార్ కి ఇప్పుడు వాళ్ళ మీద పీకల వరకు ఉంది. 

 

ఉదయం లేస్తే మజ్లీస్ తో స్నేహం చేసే కొందరు కూడా అక్కడ ఇప్పుడు మర్కాజ్ యాత్రికుల విషయంలో ఆగ్రహంగా ఉన్నారు. ముందుకి రావాలని చెప్పినా సరే ఎవరూ కూడా ముందుకి రావడం లేదు ఇప్పుడు. అలాంటి వ్యక్తులను జగన్ పొగడటం వెనుక కచ్చితంగా రాజకీయం ఉందని అనవసరంగా జగన్ వారిని పొగిడి విమర్శల పాలయ్యారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం సరైనది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: