లోకంలో పాపాలు పెరుగుతున్నప్పుడు వాటిని బ్యాలన్స్ చేయడానికి ఏదో ఒక విపత్తు వస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి.. అదీగాక మానవ సంబంధాలు కూడా రోజు రోజుకు కలుషితం అవుతున్నాయి.. మనుషుల మధ్య బంధాల కంటే ఎక్కువగా, వారి వారి సుఖాలకే ప్రాధ్యాన్యత పెరుగుతుంది.. దీనివల్ల పాపం అనే మాట కరువైపోయి.. తాపం పెరుగుతుంది.. దాని ఫలితమే అవివేకం.. ఈ అవివేకం చాటున మూర్ఖత్వం ఉండటంతో మనిషి తన ఉనికిని కోల్పోయి రాక్షసునిగా మారుతున్నాడు..

 

 

ఇకపోతే ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల మోజులో పడి ఎందరో తమ భవిష్యత్తును, సంసారాలను చేజేతులారా పాడుచేసుకుంటున్నారు.. ఇలాగే ఓ ముగ్గురు పిల్లల తల్లి క్షణిక సుఖం కోసం ఆరాటపడి తన భర్తనే చంపేసుకుంది.. ఆ వివరాలు తెలుసుకుంటే.. బాలసుబ్రహ్మణ్యం (35) అనే వ్యక్తికి, 11ఏళ్ల క్రితం, రేణుకతో ప్రేమ వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా పట్టణంలోని కదిరి రోడ్డులో గిఫ్ట్‌సెంటర్‌ నిర్వహిస్తున్న బాలసుబ్రహ్మణ్యం వ్యాపారంలో నష్టం రావడంతో రెండేళ్ల క్రితం తిరుపతికి వెళ్లి అక్కడ ట్రావెల్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తన పిల్లలతో మదనపల్లెలోనే ఉన్న రేణుకకు నాగిరెడ్డి అనే ఓ పార్టీ రాష్ట్ర సేవాదళ్‌ కార్యదర్శితో పరిచయం ఏర్పడింది..

 

 

ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకు అక్రమ సంబంధానికి దారి తీసింది.. ఈ విషయం తెలుసుకున్న భర్త తన భార్యను మందలించగా తన మాటలు వినిపించుకోకుండా అలాగే ప్రవర్తిస్తుండటంతో వారి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి.. దీంతో తన భర్తను వదిలించుకోవాలని నాగిరెడ్డితో కలిసి పధకం వేసింది.. ఈ నేపధ్యంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలో శనివారం రాత్రి బాలసుబ్రహ్మణ్యానికి జలుబు ఎక్కువగా ఉండటంతో రాత్రి 11గంటల సమయంలో పట్టణంలోకి వెళ్లి మాత్రలు తెచ్చుకోవాలని అతని భార్య బలవంతపెట్టి పంపించింది.. వెంటనే ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పగా అతను లారీతో గుద్దించి చంపేశాడు...

 

 

ఇక విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న మృతుడి సోదరుడు న్యాయవాది అయిన కె.రఘుపతి ఈ ఘటన పై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు విచారణ చేపట్టి, వాల్మీకిపురం వద్ద లారీని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పథకం ప్రకారమే బాలసుబ్రహ్మణ్యంను చంపేందుకు రేణుక, ఆమె ప్రియుడు నాగిరెడ్డి, మరికొందరు పథకం వేసినట్లు బయటపడటంతో పోలీసులు రేణుక, నాగిరెడ్డితో పాటు కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: