క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి భార‌త్ చేస్తున్న పోరాటాన్ని డ‌బ్ల్యూ హెచ్‌వో ప్ర‌శంసించింద‌ని  ప‌్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. దీజ య‌జ్క్షం దేశ ఐక్య‌త‌ను చా టింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. బీజేపీ 40వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఢిల్లీలో ప్ర‌ధాని  మోడీ ప్ర‌సంగించారు.  క‌రోనా క‌ట్ట‌డికి బీజేపీ  కార్య‌క‌ర్త లు తమ క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌హించాల‌ని పిలుపునిచ్చారు.  క‌రోనాపై భార‌త్ చేస్తున్న పోరాటం ప్ర‌పంచ దేశాల‌కు ఆద‌ర్శంగా నిలిచిందని, యావ‌త్ ప్రపంచం మ‌న సంక‌ల్పాన్ని మెచ్చుకుంద‌ని అన్నారు.  క‌రోనా వ‌ల్ల మాన‌వ జాతి తీవ్ర సంక్షాభాన్ని ఎదుర్కొంటుంద‌న్న ప్ర‌ధాని వేగవంత‌మైన క‌ఠిన నిర్ణ‌యాలే క‌రోనా ను అడ్డుకోగ‌ల‌వ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌పంచ దేశాదినేత‌లే మ‌న పోరాటాన్ని ప్ర‌శంసించార‌ని అన్నారు. అన్ని రాష్ట్రాల స‌హ‌కారంతో క‌రోనాపై పోరాటం చేస్తున్నామ‌ని అన్నారు. ఈ స‌మ‌యం దేశానికి ఛాలెంజ్ అని, మీరు మీ క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌హించాల‌న్నారు.  ప్ర‌తీ ఒక్క‌రూ ఇళ్ల వ‌ద్దే ఉంటూ , క‌రోనాను క‌ట్ట‌డి చేయాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: