సూర్యాపేటపేట జిల్లాను కరోనా వైరస్ వణికిస్తోంది. ప్రమాదం నుంచి బయట పడుతున్నామనుకునే లోపే కొత్త కేసులు నమోదై కలవరపెడుతున్నాయి. కొత్త‌గా ఆరు పాజిటివ్ కేసులు న‌మోదుకాగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8కి చేరింది. ఉమ్మ‌డి న‌ల్గగొండ జిల్లాలో పాజిటివ్ కేసులు 22కు చేరాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.  ఢిల్లీ మర్కజ్‌లో జరిగిన సమావేశాలకు హాజరై వ‌చ్చిన  ఓ వ్యక్తికి పాజిటివ్‌ అని తేలింది. అతడి నుంచే తాజాగా ఇత‌ర వ్య‌క్తుల‌కు ఈ  వైరస్‌ సోకినట్లు అధికారులు భావిస్తున్నారు.  రెండు రోజుల క్రితం 16 మంది వ్యక్తుల రక్త నమూనాలు సేక రించి హైదరాబాద్‌కు తరలించారు. అయితే ఆదివారం వచ్చిన 16 మంది వ్యక్తుల రిపోర్టుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ప్రకటించారు. మిగతా 15 మంది వ్యక్తులకు నెగెటివ్‌ వచ్చినట్లు పేర్కొంటున్నారు. దీంతో జిల్లా పరిధిలో కరోనా అనుమానితులను.. వివిధ విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు ఢిల్లీ మత ప్రార్థనలకు హాజరైన వారి సంబంధీకులు సుమారు 120 మందిని  క్వారంటైన్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: