వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు పై జనసేన పార్టీ నేత కొణిదల నాగబాబు కొన్ని సంచలన విమర్శలు చేశారు. ఇటీవల లాక్ డౌన్ కారణంగా ప్రతి కుటుంబానికి ఇస్తానన్న వెయ్యి రూపాయలు కేంద్రం ఇస్తుందా లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా అన్న విషయంపై అనేక సందేహాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

 

అయితే వీటన్నింటిని ఖండిస్తూ వైసిపి వారు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. దానికి నాగబాబు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి ఇస్తున్న వెయ్యి రూపాయలు కేంద్రం నుంచి వచ్చినవి అని దాన్ని వైసిపి నాయకులు తమ ఖాతాలో వేసుకుని బిల్డప్ ఇస్తున్నట్లు చెప్పారు.

 

అలాగే ఇటువంటి ఎన్నో తప్పుడు కారణాలను చూపించి వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని నాగబాబు వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా వైసీపీ ప్రభుత్వం ఇటువంటి చీప్ ట్రిక్స్  ప్లే చేస్తే రాబోయే రోజుల్లో శవాల మీద పేలాలు ఏరుకునే బ్యాచ్ అని పార్టీని అంటారేమో అని ఎవరిని ఉద్దేశించి కొద్దిగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

 

ఇక సోషల్ మీడియా వేదికగా వైసీపీ కీలక నేత అంబటి రాంబాబుని టార్గెట్ చేసి నాగబాబు మరికొన్ని అదిరిపోయే పంచులు వేశారు. దేవుడా ఇక అంబటి రాంబాబు ఆరోగ్యం నువ్వే కాపాడాలి, మన చేతుల్లో లేదు. ఈరోజు అంబటి రాంబాబు గారి కోసం నేను కూడా దీపం వెలిగిస్తా అని వ్యాఖ్యానించారు. ఆయన ఆరోగ్యం బాగుపడితే అమ్మోరికి తల నేలలు సమర్పిస్తాను అని వ్యాఖ్యానించారు.అవి నావి కాదు అంబటి రాంబాబు గారి తల నీలాలు అని ఘాటు విమర్శలు చేశారు. దీంతో నాగబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: