ప్రస్తుతం కరోనా వైరస్ ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయనాయకులు కూడా రాజకీయాలు కాకుండా ప్రతి ఒక్కరు రాష్ట్ర బాగు కోసం సాయం చెయ్యాల్సిన సమయం ఇది. అలాంటి ఈ సమయంలో చంద్రబాబు కరోనా వైరస్ ని కూడా రాజకీయం చెయ్యాలి అని చూస్తున్నాడు.. దీంతో వైసీపీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ అధ్యక్షుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుని తిట్టి పెడుతున్నారు.. ఒక్క చంద్రబాబుతోనే కాకుండా చంద్రబాబు మీడియాను కూడా తన తిట్లతో కడిగిపారేస్తున్నారు..  

 

ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి ఇలా ట్విట్ చేశారు... ''కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. వ్యాధి నియంత్రణలో అధికార యంత్రాంగం వెన్నుతడుతూ సిఎం జగన్ గారు ఎక్కడా చిన్న లోపం తలెత్తకుండా చూసుకుంటున్నారు. పేదలకు వెయ్యి చొప్పున వలంటీర్లు పంపిణీ చేస్తే ఎల్లో మీడియా విషపు రాతలు రాస్తోంది.'' అంటూ ట్విట్ చేశారు. 

 

అయితే నిజానికి కరోనా వైరస్ కేసులు రోజు రోజు శృతి మించుతున్నాయ్.. అలాంటి ఈ సమయంలో లోపాలు కాకుండా ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ పేదలకు అండగా ఉండాల్సిన కొన్ని మీడియాలు కూడా రాజకీయం చేస్తున్నాయి.. మన రాష్ట్రానికి మనం కాకుంటే ఇంకేవరు సపోర్ట్ చేస్తారు? ఇలాంటి పరిస్థితులలో వ్యతిరేకత చూపడం ఎంతవరుకు న్యాయం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: