ఏపీ ప్రభుత్వం కరోనా మహమ్మారితో తీవ్రం యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో కరోనా పాజిటివ్ కేసులు తక్కువగానే ఉన్నా, తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన వారి వల్ల కరోనా కేసులు బీభత్సంగా పెరిగిపోయాయి. ఇప్పటికే ఏపీలో 300 కేసులు దాటేశాయి. అయితే జగన్ ప్రభుత్వం కరోనా వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకుంటుంది. అలాగే లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేద ప్రజలని కూడా ఆదుకునే కార్యక్రమం చేస్తోంది.

 

అయితే ఇలాంటి విపత్కర సమయంలో ప్రభుత్వానికి సపోర్ట్ ఉండాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం, విమర్శలు చేస్తున్నారు. తెలివిగా సలహాలు ఇస్తున్నట్లు ఇస్తూనే, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. తాజాగా కూడా ప్రభుత్వం కరోనా కేసులని దాచిపెడుతుందని విమర్శించారు. అసలు ప్రభుత్వానికి కరోనా కేసులు దాచిపెట్టాల్సిన అవసరం ఏం వస్తుంది. దాచిపెడితే ఇంకా దారుణమైన నష్టం జరగడం తప్ప. అలాంటప్పుడు కరోనా కేసులని ప్రభుత్వం దాచి పెట్టి ఏం సాధిస్తుంది.

 

ఇక ఇదే విషయంపై మంత్రి పేర్ని నాని కూడా బాబుపై మండిపడ్డారు. కరోనా వ్యాప్తి అరికట్టేందుకు తాము కృషి చేస్తుంటే, రాష్ట్రంలో లెక్కకు మించి పాజిటివ్ కేసులు ఉన్నాయని చంద్రబాబు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని, అసలు ఆయన కరోనా కంటే ప్రమాదమైన వైరస్ లాంటివారని మాట్లాడారు.

 

ఇదే సమయంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేసే మావోయిస్టులు కూడా కరోనా గురించి ఆలోచించి, ప్రభుత్వ పనులకు ఎలాంటి ఆటంకం కలగించకూడదని, పోలీసులపై దాడులు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎంతో కఠినంగా ఉండే మావోయిస్టులే ప్రభుత్వాలకు మద్ధతు తెలుపుతుంటే బాబు మాత్రం రాజకీయాలు చేస్తూ, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అసలు  బాబు కంటే మావోయిస్టులే బెటర్ అంటూ కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: