కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాలను కబళిస్తున్న వేళ.. ఏపీలో మాత్రం ఇంకా రాజకీయ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ సర్కారు కరోనా సాయాన్ని కూడా రాజకీయం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. తాను ముందు నుంచి చెబుతున్నా... జగన్ పట్టించుకోలేదని.. తగినన్ని పరీక్షలు చేయలేదని.. తన మాట లెక్కచేయకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి వచ్చిందని చంద్రబాబు విమర్శించారు.

 

 

ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై వైసీపీ సర్కారు మండిపడుతోంది. కరోనా కష్ట సమయంలోనూ చంద్రబాబుకూ రాజకీయాలేంటని మండిపడుతోంది. బాబు మనస్తత్వం అంతర్జాతీయ తీవ్రవాదిలా ఉందని మంత్రి పేర్ని మండిపడ్డారు. కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మిగతా రాష్ట్రాల కంటే ముందుందని నాని పేర్కొన్నారు. మండల స్థాయి విలేకర్లకు ఉన్న సామాజిక బాధ్యత చంద్రబాబు లేదని ఆయన ఎద్దేవా చేశారు.

 

 

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కరోనా కట్టడిలో ఏపీ ముందుందన్న పేర్ని నాని... ఇలాంటి కష్ట సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో ఉంటూ తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 వేల క్వారంటైన్‌ బెడ్స్‌ ఏర్పాటు చేశామని పేర్ని నాని గుర్తు చేశారు. చంద్రబాబుకు మానవత్వం లేదని.. మానవీయ కోణం అసలే లేదని విమర్శించారు. చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు.

 

 

ఏపీ ప్రభుత్వం కరోనా పాజిటివ్‌ కేసులు దాస్తుందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీలో ఎవరైనా కరోనా బాధితులు ఉంటే పరీక్షలు చేయిస్తామని నాని అన్నారు. వైద్యులు, పోలీసులు, వాలంటీర్లు, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎమ్‌లు, పారిశుద్ధ్య కార్మికులు సైనికుల్లా విధులు నిర్వర్తిస్తున్నారని నాని కొనియాడారు. ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు చేయడం బాధకరమని అన్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: