రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం తంగడపల్లి వంతెన కింద మార్చి 17 లభ్యమైన ఒక వివాహిత మృతదేహానికి సంబంధించిన కేసులోని సంచలన విషయాలు ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేస్తున్నాయి. పోలీసుల విచారణలో లభ్యమైన వివాహితని హతమార్చింది ఇద్దరు యువకులు అని తేలింది. ఒక పథకం ప్రకారం ఆమెని అత్యాచారం చేసి దారుణంగా హత్యకు పాల్పడ్డారని ప్రాథమికంగా నిర్ధారించుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకొని నిజాలను ఒక్కొక్కటిగా బయటకు లాగుతున్నారు.

 

వివరాల్లోకి వెళితే హత్యకు గురైన మహిళకు వివాహమైంది. అయితే ఆమె పెళ్ళికి ముందే ప్రధాన నిందితుడితో ప్రేమాయణం కొనసాగిస్తూ ఉంది. పెళ్లయిన తర్వాత కూడా వారి సంబంధం అలాగే కొనసాగగా ఇక ప్రియుడితో వెళ్లిపోయి మళ్లీ కొత్త జీవితం మొదలుపెడదామని అతనిని పెళ్లి చేసుకోమని పదేపదే ఒత్తిడి చేస్తూ ఉంది. ఇదే సమయంలో నిందితుడు వేరొక అమ్మాయికి దగ్గర కావడంతో ఈమె పోరు తట్టుకోలేక పథకం ప్రకారం హత్య చేసేందుకు సిద్ధమయ్యాడు. ముందు ఆమెను దూరం పెట్టేందుకు చూసినా ఆమె లో ఎటువంటి మార్పు రాకపోగా ఇంకా ఒత్తిడి ఎక్కువ కావడంతో ఎలాగైనా వదిలించుకోవాలని ఇంత దారుణానికి ఒడిగట్టాడు.

 

లాంగ్ డ్రైవ్ కు వెళ్దామని బాధితురాలిని నమ్మించి అద్దె కారులో ఎక్కించుకున్నాడు. ప్రియుడు బలవంతంగా ఆమెపై అత్యాచారం జరిపాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత మరొక వ్యక్తి బలాత్కారం చేశాడు. మట్టుబెట్టాలనే ఉద్దేశ్యం తో గొంతు నులిమి హత్య చేశారు. మహిళ దుస్తులు తీసేసి మృతదేహాన్ని ఫ్లై ఓవర్ కిందకు తెచ్చారు. గంట పాటు అక్కడే ఉండి తలను ఛిద్రం చేశారు. కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా విషయాలు వెల్లడయ్యాయి. కేసులో కారు జీపీఎస్ కీలకంగా మారింది. అలాగే పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం కూడా కొన్ని బృందాలు గాలిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: