కరోనా వైరస్ కారణంగా నిత్యం బిజిబిగా ఉండే నేతలు సైతం ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు. నిత్యం జనంలో తిరిగే నాయకులు కూడా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్య జనంలో తిరిగే మనిషి. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని జనంలో తిరుగుతుంటారు. ఇప్పుడు ఆయన లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్‌ కే పరిమితం అయ్యారు.

 

 

అయితే.. జనతా కర్ఫ్యూ విధించిన రోజు..ప్రముఖులంతా తమ సెల్ఫీ ఫోటోలు, సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. అలాగే చంద్రబాబు కూడా ఓ వీడియో పోస్టు చేశారు. అందులో ఆయన తన మనవడు దేవాన్ష్‌కు ఇంగ్లీషు పాఠాలు చెబుతున్నారు. ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ వీడియోనుద్దేశించి ఓ వైసీపీ మంత్రి ఘాటుగా సెటైర్ పేల్చారు.

 

 

చంద్రబాబు ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం అంతంత మాత్రమే అన్న సంగతి తెలిసిందే. వాట్ అయామ్‌ సేయింగ్‌ ఈజ్.. అంటూ ఆయన ఇంగ్లీషులో మాట్లాడుతుంటే.. తెలుగులోనే చెప్పినట్టు అనిపిస్తుంది. బలవంతంగా ఇంగ్లీషు మాట్లాడినా ఏదో నామ్‌ కే వాస్తే అన్నట్టుగానే ఉంటుంది. మరి అలాంటి చంద్రబాబు తన మనవడికి ఇంగ్లీష్ ట్యూషన్ చెబితే ఎలా.. ఆ పిల్లాడి భవిష్యత్ పాడవుతుందంటున్నారు వైసీపీ మంత్రి పేర్ని నాని.

 

చంద్రబాబు హైదరాబాద్ లో తన భవనంలో ఉండడం మంచిదేనని..అయితే ఖాళీగా ఉన్నారు కదా అని మనుమడిని చెడగొట్టవద్దంట సెటర్ పేల‌్చారు. చంద్రబాబుకు ఇంగ్లీష్, తెలుగు రెండూ సరిగా రావని, తనకు రాని భాషను మనుమడికి మాత్రం నేర్పించవద్దని సూచిస్తున్నానని పేర్ని అన్నారు. ఆ దిక్కుమాలిన వచ్చీ రాని ఇంగ్లీస్ నేర్పితే మనుమడు కూడా చెడిపోతాడని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మనవడికి ఇంగ్లీష్ నేర్పేపని బ్రహ్మణికే వదిలేయడం మంచిదని సలహా ఇచ్చారు. మరి ఈ సలహా చంద్రబాబు పాటిస్తారా..లేక తన మనవడికి తానే ఇంగ్లీష్ పాఠాలు బోధిస్తూనే ఉంటారా..?

మరింత సమాచారం తెలుసుకోండి: