రెండు తెలుగు రాష్ట్రాలల్లో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దింతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏపీలో కర్నూలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో జిల్లా ప్రజలు ఎప్పుడేం జరుగుతుందో..? ఎటు నుంచి వైరస్ ఎవరికొస్తుందో..? అని భయపడుతూ బతుకుతున్నారు.
ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గత రెండు రోజులుగా హోం క్వారంటైన్లో ఉన్నారు. దీంతో అతనికి ఏం జరిగిందో ఏమో అని అభిమానులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందారు. అనిల్కు తాజాగా కరోనా టెస్ట్లు చేయగా నెగిటివ్ అని రావడంతో అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. కరోనా పాజిటివ్ వచ్చిన డాక్టర్ తో ఆయన గతంలో ఓ కార్యక్రమంలో కలిశారు. దీంతో అనుమానంతో తాజాగా టెస్ట్లు చేయగా నెగిటివ్ అని వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ రోజు నుండి యథావిధిగా అనిల్ కుమార్ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
మరోవైపు పాజిటివ్ వచ్చిన ఆ డాక్టర్ మంత్రి అనిల్ తో పాటు చాలా మంది డాక్టర్లు, రోగులని కాంటాక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఆయన ప్రైవేట్ డాక్టర్ అని అధికారులు గుర్తించినట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఆస్పత్రి ప్రారంభోత్సవంలో డాక్టర్లంతా కలిసినట్లు తెలుస్తోంది. ఆ టైమ్లో ఆ ప్రైవేట్ డాక్టర్ కూడా ఉన్నారని సమాచారం. అయితే ఆయనకు కరోనా ఉన్నట్లు తెలుసుకున్న పలువురు డాక్టర్లలోనూ కలవరం మొదలైంది. ఇదిలా ఉంటే.. ఆ డాక్టర్లంతా స్వచ్చంధంగా క్వారంటైన్ కి వెళుతున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle