కరోనా వైరస్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ వైరస్ మహమ్మారిని కట్టడి చేయలేక ప్రభుత్వాలు తలలు పట్టుకుం టున్నాయి. ఈ ఆపత్కాల సమయంలో సమాజంలోని అన్ని వర్గాలు ఒక్కటై కరోనా పై యుద్ధమే చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సెలబ్రెటీల నుంచి సా ధారణ ప్రజల వరకు తమ వంతుగా ప్రభుత్వాలకు సహాయ, సహాకరాలు అందిస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ముందుకొచ్చి వేల కోట్ల రూపాయలను కరోనాపై పోరు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళంగా అందజేశాయి. ఈక్రమంలోనే ఆంధ్రప్రదేశ్కు చెందిన నాలుగేళ్ల బుడుతడు కరోనా మీద పోరాటానికి తన వంతు సాయంగా ముఖ్య మంత్రి సహాయ నిధికి రూ.971 విరాళం అందజేసి శభాష్ అనిపించుకున్నాడు. ఈమేరకు తాను దాచుకున్న నగదును విజయవాడలో ఏపీ మంత్రి పేర్ని వెంకటరామయ్యకు అందజేశారు. ఈసందర్భంగా హేమంత్ను మంత్రి అ భినందించారు. సైకిల్ కొనుకుందామని డబ్బును దాచి పెట్టుకుంటున్న హేమంత్... కరోనా ప్రబలుతున్న పరిస్థితులను చూసి మనసు చలించి సీఎం రిలీఫ్ ఫండ్కు నగదు అందజేయడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.