మానవ సంబంధాలు రోజు రోజుకు ఎంత దిగజారుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్రమ సంబంధాలు ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టడంతో పాటు ఎంతో మందిని బలి తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అక్రమ సంబంధం నేపథ్యంలో ఓ వివాహత బలి అయ్యింది. 16 ఏళ్లక్రితం భర్త సూసైడ్ చేసుకుని చనిపోవటంతో ఒంటరిగా ఉన్న మహిళ, తన బావతో అక్రమ సంబంధం పెట్టుకుంది. వీరిద్దరు వీలున్నప్పుడల్లా రాసలీలల్లో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే ఆ మహిళ దెబ్బతో బావ ఫ్యామిలీలో చిచ్చు మొదలైంది. చివరకు ఏం జరిగిందో ఈ కథనంలో చూద్దాం.
చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బండ్లపాయి గ్రామంలో జ్యోతి (38) అనే మహిళకు వాసు అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి 15,12 ఏళ్ల వయస్సు గల ఇద్దరు పిల్లలున్నారు. భర్త ఆత్మహత్య చేసుకోవడంతో జ్యోతి అదే గ్రామంలో ఊరి చివర ఒంటరిగా నివసిస్తోంది. ఈ క్రమంలోనే తన భర్త అన్నయ్య చంద్రశేఖర్తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం బయటకు పొక్కడంతో చంద్రశేఖర్ భార్య, భర్తను నిలదీసింది.
బంధువులు ఈ గొడవలకు కారణం నువ్వే అని జ్యోతిని మందలించడంతో ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృత దేహానికి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకున్న చౌడేపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా అక్రమ సంబంధాల వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో ? ఎలాంటి వితప్కర పరిస్థితులు ఎదురవుతాయో ? ఈ ఉదంతమే పెద్ద ఉదాహరణ.